Nokia X30 5G | భారత్ మార్కెట్లోకి హెచ్ఎండీ గ్లోబల్ తన నోకియా ఎక్స్ 20 5జీ ఫోన్ తీసుకొచ్చింది. ఈ ఫోన్ గత సెప్టెంబర్లోనే గ్లోబల్ మార్కెట్లో ఆవిష్కరించింది. ఫోన్ ఫ్రేమ్ 100 శాతం రీసైకిల్డ్ అల్యూమినియం, బ్యాక్ కవర్ 65 శాతం రీసైకిల్డ్ ప్లాస్టిక్తో తయారు చేశారు.
నోకియా ఎక్స్30 5జీ ఫోన్ 8జీబీ రామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీతో కస్టమర్లకు అందుబాటులోకి వస్తున్నది. దీని ధర రూ.48,999గా నిర్ణయించారు. క్లౌడీ బ్లూ, ఐస్ వైట్ రంగుల్లో లభిస్తుంది. కంపెనీ అధికారిక సైట్తోపాటు అమెజాన్లో ఆన్లైన్ ప్రీ-బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. ఈ నెల 20 నుంచి నోకియా ఎక్స్30 5జీ ఫోన్ సేల్స్ మొదలవుతాయి.