పరిగి : అభివృద్ధి పనులు నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా నిర్వహించాలని లేదంటే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ఎమ్మెల్యే మహేశ్రెడ్డి తెలిపారు. ఆదివారం మున్సిపల్ పరిధిలోని హనుమాన్ దేవాలయం నుంచి తుంకులగడ్డ రోడ్డు, కోర్టు నుంచి తాసిల్దార్ కార్యాలయం వరకు సీసీ, సైడ్డ్రైన్స్ నిర్మాణం పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన కాంట్రాక్టర్తో మాట్లాడుతూ అభివృద్ధి పనులు పదికాలాలు నిలబడి ఉండాలంటే నిర్మాణంలో నాణ్యత లోపించకుండా ఉండాలని పేర్కొన్నారు.
నాణ్యతాలోపాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో సబంధిత అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించి పనుల పురోగతిపై చర్చించారు. కార్యక్రమంలో ఎంపీపీ అరవిందరావు, జడ్పీటీసీ హరిప్రియ, మార్కెట్ కమిటీ చైర్మన్, పీఏసీఎస్ చైర్మన్ శ్యాంసుందర్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ అశోక్, సీనియర్ నాయకులు ప్రవీణ్కుమార్ రెడ్డి పాల్గొన్నారు.