ఇబ్రహీంపట్నంరూరల్, అక్టోబర్ 24 : క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో త్వరలో ఇబ్రహీంపట్నంలో ప్రభుత్వ సహకారంతో క్రికెట్ స్టేడియాన్ని నిర్మించనున్నట్లు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అర్షనపల్లి జగన్మోహన్రావు తెలిపారు. మంగళవారం దండుమైలారం గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తల్లిదండ్రులు దయ దండుమైలారం గ్రామ ప్రజల దీవెనలు, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వాదంతో హెచ్సీఏ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. క్రికెట్ అసోసియేట్ ఆధ్వర్యంలో కావాల్సిన అన్ని సదుపాయాలను ఎమ్మెల్యే సహకారంతో ఏర్పాటు చేస్తానన్నారు. త్వరలో రాచకొండ క్రికెట్కప్ పేరిట టోర్నమెంట్నిర్వహించనున్నట్లు తెలిపారు. అంతకుముందు క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైన జగన్మోహన్రావుకు సోమవారం దండుమైలారంలో ఘనస్వాగతం పలికారు. కార్యక్రమంలో సహకార సంఘం చైర్మన్ వెంకట్రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా నాయకులు జంగయ్య పాల్గొన్నారు