పెద్దేముల్ : నిషేధిత గుట్కాలను విక్రయిస్తే కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామని పెద్దేముల్ ఇన్చార్జి ఎస్ఐ కృష్ణకాంత్ హెచ్చరించారు. శనివారం మండల కేంద్రంతోపాటు మంబాపూర్, రుక్మాపూర్ గ్రామాల్లో జిల్లా ఎస్పీ నారాయణ ఆదేశాల మేరకు పలు కిరాణా దుకాణాలు, పాన్షాపుల్లో సిబ్బందితో కలిసి ఆకస్మికంగా దాడులు నిర్వహించి పలుచోట్ల నిషేధిత గుట్కా పౌచులను పట్టుకున్నారు. ఈ సందర్భంగా పెద్దేముల్ ఇన్చార్జి ఎస్ఐ కృష్ణకాంత్ మాట్లాడుతూ ఎస్పీ నారాయణ ఆదేశాల మేరకు శనివారం మండల కేంద్రంతోపాటు మంబాపూర్, రుక్మాపూర్ గ్రామాల్లోని పలు కిరాణ షాపులు, పాన్షాపులపై ఆకస్మికంగా దాడులు నిర్వహించామన్నారు.
ఈ దాడుల్లో మంబాపూర్ గ్రామంలో ఓ కిరాణా షాపులో రూ.3595/- విలువ చేసే 2400 నిషేధిత గుట్కా పౌచులు, పెద్దేముల్ మండల కేంద్రంలోని ఓ పాన్షాపులో రూ.2,535 విలువ చేసే 1034 నిషేధిత గుట్కా పౌచులను పట్టుకొని, సదరు దుకాణ యజమానులపై కేసులు నమోదు చేశామన్నారు. నిషేధిత పదార్థాలు, గుట్కాలను అక్రమంగా రవాణా చేసి, ఇండ్లు, వివిధ షాపుల్లో నిల్వ ఉంచిన వారిపై చట్టరీత్యా కేసులు నమోదుచేస్తామన్నారు. ఈ దాడుల్లో ఏఎస్ఐ నారాయణ, హెడ్కానిస్టేబుల్ మల్లేశం, కానిస్టేబుళ్లు రవి, వెంకట్రాంరెడ్డి, ప్రశాంత్, రవినాయక్ పాల్గొన్నారు.