బడంగ్పేట( హైదరాబాద్) : అంగన్ వాడీ టీచర్లు, సిబ్బంది సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పి సబితా ఇంద్రారెడ్డి(Mla Sabita Indra Reddy) అన్నారు. ఐసీడీఎస్(ICDS) పురోగతిపై మంగళవారం ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహేశ్వరం నియోజక వర్గంలో సమస్యలు లేని అంగన్వాడీ కేంద్రాలు (Anganwadi Centres) గా మార్చడానికి చొరవ తీసుకుంటానన్నారు. సమాజంలో అమ్మ, అమ్మమ్మ పాత పోషిస్తున్న అంగన్వాడీ టీచర్లను ప్రశంసించారు.
అంగన్వాడీ కేంద్రాలను సకల సౌకర్యాలతో మోడల్గా తీర్చిదిద్దడానికి కృషి చేస్తానన్నారు. సంక్షేమంలో అంగన్ వాడీ టీచర్ల పాత్ర, ఐసీడీఎస్ పాత్ర గొప్పదని కొనియాడారు. ఇంటిని చక్కదిద్దే మహిళలు సాధించలేనిది ఏమిలేదన్నారు. పట్టుదలతో పనిచేస్తే ఏదైనా సాధించ వచ్చని సూచించారు. కేంద్రాల వారీగా సమగ్ర నివేదిక తయారు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.
బీఆర్ఎస్ హయాంలో చిన్న పిల్లల కోసం పార్కులను ఏర్పాటు చేశామన్నారు. ఈ సమీక్షలో సీడీపీవో వినితా దేవి, జల్పల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ ఫర్హానాజ్, కార్పొరేటర్ లావణ్య, సూపర్ వైజర్లు, అంగన్ వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.