తాండూరు : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బతుకమ్మ చీరల పంపిణీ శనివారం తాండూరు నియోజకవర్గంలోని తాండూరు, యాలాల, బషీరాబాద్, పెద్దేముల్ మండలాల్లో ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్రెడ్డి పంపిణీ చేశారు. చీరలను తీసుకున్న మహిళలు సంతోషం వ్యక్తం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి బతుకమ్మ చీరలు అందుతాయని అధికారులు, ప్రజా ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్రెడ్డి మాట్లాడుతూ మహిళ ఆత్మగౌరవం తెలంగాణ సర్కార్ ధ్యేయమని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందజేస్తున్నట్లు తెలిపారు.