బొంరాస్పేట, డిసెంబర్ 14 : గిరిజనులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకొనే దసరావ్ పండుగలు మండలం లో ఘనంగా జరుపుకుంటున్నారు. ప్రతిరెండేండ్లకోసారి కార్తీక పౌర్ణమి తరువాత వచ్చే మంగళవారం నుంచి ఈ పండుగలను జరుపుకొంటారు. వానకాలం పంటలు చేతికొచ్చిన సమయంలో ఈ పండగలను ఇంటిల్లి పాది ఆనందోత్సాహాల మధ్య నిర్వహించుకుంటారు. సోమ, మంగళ, బుధ వారా ల్లో మూడు రోజులపాటు పండుగను జరుపుకొంటారు. లంబాడీల ఆరాధ్య దైవ మైన మహా రాష్ట్రలోని తుల్జాపూర్లో కొలువైన తుల్జాభవానీ మాతను దర్శిం చుకుని వచ్చి పండుగను జరుపుకొంటారు. ధాన్యం బస్తాలకు రంగు రంగుల పూల తో అలంకరణ చేసి నైవేద్యం సమర్పిస్తారు. బంధు మిత్రు లను ఆహ్వానించి సంతోషంగా పండుగ సంబురాల్లో మునిగి తేలుతున్నారు. తమ సం ప్రదాయ వస్ర్తాలను ధరించి రాత్రి సమయాల్లో ఉత్సాహంగా నృత్యాలు చేసి ఆనందిస్తు న్నారు. మంగళవారం రాత్రి బాపల్లితండాలో ఎంపీపీ హేమీ బాయి నివాసంలో నిర్వ హించిన దసరావ్ ఉత్సవంలో కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి పాల్గొని గిరిజనులకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.