నవాబుపేట : షిర్డీ సాయిబాబా విగ్రహా ప్రతిష్ఠాపన మహోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. శనివారం నవాబుపేట మండల పరిధిలోని యెల్లకొండ గ్రామ సమీపాన నూతనంగా షిర్డీ సాయిబాబా ఆలయాన్ని వెంకట్రెడ్డి నిర్మించారు. ఈ సందర్భంగా విగ్రహ ప్రతిష్ఠాపనకు ముఖ్య అతిథిగా తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, చెవేళ్ల పార్లమెంట్ సభ్యుడు రంజిత్రెడ్డి, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్య హాజరయ్యరు. అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఎంపీ మాట్లాడుతూ ఇక్కడ ఆలయం నిర్మించడంతో పరిసరా ప్రాంతం మొత్తం ప్రశాంతంగా ఉంటుందన్నారు.
గ్రామ సర్పంచ్, సాయిబాబా ట్రస్టు చైర్మన్ వెంకట్రెడ్డి పూర్వజన్మలో ఏ పుణ్యం చేసుకున్నాడో ఈ రోజు నవాబుపేట మండల వాసులకు మంచి సౌకర్యాన్ని కల్పించారని గుర్తుజేశారు. సంకల్పం ఉంటే ఎంతటి కార్యమైనా విజయవంతం అవుతుందని సూచించారు. కార్యక్రమంలో యెల్లకొండ గ్రామ సర్పంచ్, షిర్డీ సాయిబాబా ట్రస్టు చైర్మన్ రావుగారి వెంకట్రెడ్డి, గ్రామ ఉప సర్పంచ్, స్థానిక టీఆర్ఎస్ నాయకులు, మండలంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన భక్తులు పాల్గొన్నారు.