పరిగి : నూతన జోనల్ విధానం కింద ఉద్యోగుల కేటాయింపుపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ మంగళవారం జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ మాట్లాడుతూ ఈ నెల 16వ తేదీలోగా జిల్లా, జోనల్, మల్టీ జోనల్ ప్రక్రియ పూర్తి చేయాలని, 20వ తేదీ లోపు ఉద్యోగుల కేటాయింపు ఆదేశాల తర్వాత వారం రోజుల్లో ఉద్యోగులు విధులలో చేరాలని ఆదేశించారు.
అనంతరం వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల మాట్లాడుతూ రేపటి లోగా శాఖల వారిగా జిల్లా, జోనల్ వారిగా ప్రక్రియ పూర్తి చేసి ఒక కాఫీ తనకు పంపించాలని ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్లు మోతిలాల్, చంద్రయ్య, అధికారులు పాల్గొన్నారు.