తలకొండపల్లి : బాధిత కుటంబాలను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుంద ని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ పేర్కొన్నారు. తలకొండపల్లి మండలంలోని మాదాయపల్లి గ్రామాని కి చెందిన సంతోశ్ ఆనారోగ్యానికి గురయ్యారు. వైద్యం కోసం బాధితుడి కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే జైపాల్యాదవ్ను ఆశ్రయించారు. ఎమ్మెల్యే బాధితుని కుటుంబ సభ్యుల చేత ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేయించారు. ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ. 65వేల రూపాయల విలువ గల చెక్కు మంజూరైంది. మంజూరైన చెక్కును శుక్రవారం బాధితుని కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే బాధితులకు అందించారు. కార్యక్రమంలో మనగల్లు మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, శివశంకర్రెడ్డి, శ్రీశైలం, హరిమోహన్రెడ్డి, శ్రీధర్రెడ్డి, రాజు, శ్రీను, యాదగిరి పాల్గొన్నారు.