తాండూరు : తాండూరు ప్రతిభ హైస్కూల్లో సంక్రాంతి సంబరాల్లో భాగంగా గురువారం విద్యార్థులు 70పీట్ల భారీ ముత్యాల ముగ్గును వేసి అబ్బురపరిచారు. ఈ సందర్భంగా పాఠశాల నిర్వాహకులు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు సంస్కృతీ సంప్రదాయాలను తమ జీవన శైలిలో అలవర్చుకొని, సాంకేతికతతో పాటు నైతికతను పెంపొందించుకోవాలని, సంప్రదాయాలు మరుగున పడుతున్న ఈ కాలంలో పండుగలే సాంప్రదాయాల పరిరక్షణ సాధనాలని అన్నారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా విద్యార్థులు 70 ఫీట్ల భారీ ముత్యాల ముగ్గును వేసి తమ కళా నైపున్యాన్ని ప్రదర్శించారు.
భవిష్యత్లో ఇలాంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకతను పెంపొందించడానికి కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల కరస్పాండంట్ నరేష్ కుమార్, యాజమాన్య సభ్యులు నిర్ని చంద్రశేఖర్, రామకృష్ణ, ప్రిన్సిపాల్ రవి కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.