వికారాబాద్ : వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలంయలో శనివారం ఎంపీడీవోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సత్తయ్య, ట్రేసా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్కుమార్, ట్రేసా సంఘం జిల్లా అధ్యక్షుడు కృష్ణయ్యలు మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అదే విధంగా రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్పటేల్ను వారి నివాసంలో కలిసి పుష్పగుచ్ఛం అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
మీరు భవిష్యత్లో మరెన్నో పదవులు అదిరోహించాలని వారు ఆకాంక్షించారు. కలిసిన వారు ట్రేసా సెంట్రల్ కౌన్సిలర్ అమరేంద్రకృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి విజయేందర్, డివిజన్ నాయకులు రాములు, ప్రవీణ్కుమార్ ఉన్నారు.