కులకచర్ల : దేవాలయాలు ప్రశాంతతకు నిలయాలని డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్రెడ్డి అన్నారు. మంగళవారం డాపూర్ మండల పరిధిలోని వీరాపూర్ గ్రామంలో మంగళవారం పోచమ్మ దేవాలయం ప్రారంభోత్సవానికి టీఆర్ఎస్ జిల్లా నాయకుడు కొప్పుల అనీల్రెడ్డితో కలిసి దేవాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో దేవాలయాల ఉత్సవాలు సామూహికంగా ఐక్యతతో నిర్వహించుకోవడం అభినందనీయమని అన్నారు. దేవాలయాలు ప్రశాంతతకు నిలయాలని అన్నారు.
కార్యక్రమంలో కులకచర్ల టీఆర్ఎస్ అధ్యక్షుడు శేరి రాంరెడ్డి, డాపూర్ మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు సుధాకర్రెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ నాగరాజు, రైతుబంధు సమితి అధ్యక్షుడు రాజు, వీరాపూర్ గ్రామ సర్పంచ్ జనార్దాన్రెడ్డి, ఉపసర్పంచ్ నర్సింలు, డాపూర్ ఎంపీటీసీ శంకర్, వార్డు సభ్యుడు అశోక్, యాదయ్య, రాజయ్య, యువజన సంఘాల సభ్యులు, ఉత్సవ సమితి సభ్యులు పాల్గొన్నారు.