మోమిన్పేట : సమాజంలో నేరాల నియంత్రణకై చట్టాలపై విద్యార్థులకు అవగహన ఎంతో అవసరమని 12వ అదనపు జిల్లా న్యాయమూర్తి పద్మా అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఏజేఆర్ ఫంక్షన్హాల్లోని మండల పరిధిలోని పౌరులకు, విద్యార్థులకు సీనియర్ సివిల్ జడ్జి శ్రీదేవి, జూనియర్ సివిల్ జడ్జిలు కవిత, లక్ష్మితో కలిసి న్యాయవ్యవస్థ, చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాల్లోని ప్రజలకు, పౌరులకు విద్యార్థులకు న్యాయ వ్యవస్థ, చట్టాలపై అవగాహన ఉండాలని తెలిపారు. చట్టాల గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, ఇంటి నుంచే నేర నియంత్రణ అలవర్చుకోవాలని సూచించారు.
బాలికలకు కళాశాలల్లో ర్యాగింగ్, సమాజంలో లైంగిక వేదింపులకు గురైనప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు, న్యాయవ్యవస్థ పరంగా చేయవలిసిన పనులపై విపులంగా వివరించారు. బాల్య వివహాలపై వచ్చే సమస్యలు క్లూప్తంగా వివరించి ఎట్టి పరిస్థితుల్లో బాల్య వివహాలు చేసుకోవద్దని బాలికకు 18, బాలురకు 21సంవత్సరాల వయస్సు వచ్చిన తర్వాతనే వివహాలు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సీఐ వెంకటేశం, ఎస్సై శేఖర్ గౌడ్, జిల్లా జూనియర్ కళాశాల విద్యాధికారి శంకర్ నాయక్, వికారాబాద్ జిల్లా బార్ అసొసియేషన్ జనరల్ సెక్రెటరీ రమేశ్ ముదిరాజ్, అడ్వకేట్ రాజశేఖర్, ప్రిన్సిపాల్ చెన్నయ్య, లెక్చరర్స్, విద్యార్థులు పాల్గొన్నారు.