టీడీఆర్ : కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా భక్తులకు సిరులిచ్చే శ్రీవల్లిగా రేణుక ఎల్లమ్మ భక్తుల నీరాజనాలందుకొంటుందని ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డి అన్నారు. శుక్రవారం తాండూరు పట్టణం నేహ్రు గంజ్ ఆవరణలో వెలసిన రేణుకా నాగ ఎల్లమ్మ జాతరలో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాండూరు నియోజకవర్గ ప్రజలతో పాటు ప్రతి ఒక్కరిని చల్లగా చూడాలని అమ్మవారిని కోరామన్నారు. ప్రజలందరూ కరోనా నుంచి రక్షణ పొందే విధంగా తగు చర్యలను తీసుకోవాలన్నారు.
మహిళ భక్తులు అమ్మవారిని దర్శించుకొని బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. శనివారం జాతర ఉత్సవాలు ముగియనున్నాయని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.