పరిగి : పిల్లలో ఎదుగుదల పర్యవేక్షణకు సంబంధించిన ప్ర త్యేక కార్యక్రమాన్ని పక్కాగా అమలు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య సూచించారు. గురువారం మహిళా, శిశు, దివ్యాంగుల, వయో వృద్దుల శాఖ ఆధ్వర్యంలో డీపీఆర్సీ భవనంలో జరిగిన సమీక్షా సమా వేశంలో పాల్గొన్న అదనపు కలెక్టర్ చంద్రయ్య మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల ఎదుగుదలకు సంబంధించిన పర్యవేక్షణ అమలు పక్కాగా చేపట్టాలని, అతి తీవ్ర పోషణ లోపం ఉన్న పిల్లల కోసం తాండూరులోని జిల్లా దవాఖానలో ఎన్ఆర్సీ సెంటర్కు రెఫర్ చేయాలన్నారు.
మాతాశిశు కేంద్రంలో ప్రత్యేకంగా ఇద్దరు డాక్టర్లను నియమించినట్టు తెలిపారు. తీవ్ర పోషణ లోపం ఉన్న పిల్లలను దవాఖానకు తీసుకువెళ్లడానికి 102 వాహ నాన్ని వినియోగించుకోవచ్చని సూచించారు. అంగన్వాడీ కేంద్రాల పరిధి లోని పరిసరాలు పరశుభ్రంగా ఉండేలా చూడాలని, అంగన్వాడీ కేంద్రాల చుట్టూ ఇనుప కంచెను ఏర్పాటు చేసేలా డీపీవో సహకారం తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రతి అంగన్వాడీ కార్యకర్త, హెల్పర్, స్వయం సహాయక సం ఘాల మహిళలు, ఉపాధిహామీ సిబ్బంది ఈ శ్రమ్ పోర్టల్లో తమ పేర్లు నమోదు చేయించుకోవాలని సూచించారు.
జిల్లా మహిళా అభివృద్ది అధికారి లలితకుమారి మాట్లాడుతూ జిల్లాలో 1106 అంగన్వాడీ కేంద్రాలు నిర్వ హిస్తున్నామని, ఇందులో 67342 మంది పిల్లలు, 5601 మంది బాలిం తలకు సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. పోషణ లోపం ఉన పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించి డబుల్ న్యూట్రిషన్ అందిస్తున్నట్టు పేర్కొన్నారు. కార్యక్రమం లో జడ్పీ సీఈవో జానకిరెడ్డి, డీపీవో మల్లారెడ్డి, వైద్యాధికారి డాక్టర్ అరవిం ద్, సీడీపీవోలు, సూపర్వైజర్లు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.