కులకచర్ల : నిషేదిత పదార్థాలను విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని కులకచర్ల ఎస్ఐ శ్రీనివాస్ అన్నారు. శనివారం డాపూర్ మండల కేంద్రంలో మరికల్ గ్రామానికి చెందిన ఎండీ షఫీ అనే వ్యక్తి రూ. 204విలువ చేసే నిషేదిత గుట్కాప్యాకేట్లు, రూ. 750విలువ చేసే టోబాకో ప్యాకేట్లు డాపూర్ గ్రామంలో కిరాణం దుకాణాలకు వేస్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు.
మత్తు పదార్థాలను స్వాదీనం చేసుకొని షఫీపై కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. నిషేదిత గుట్కా పదార్థాలను ఎవ్వరు విక్రయించినా తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు.