వికారాబాద్ : మార్షల్ ఆర్ట్స్ వల్ల శారీరక, మానసిక ధృడత్వం పెంపొందుతుందని జిల్లా ఎస్పీ నారాయణ తెలిపారు. బుధవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఇండోర్ నేపాల్ ఇంటర్నేషనల్ తైక్వాండో ఛాంపియన్ షిప్లో బంగారు పథకాలు సాధించిన విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా ఎస్పీ నారాయణ మాట్లాడుతూ గత నెల నవంబర్ 27, 28 తేదీల్లో ఢిల్లీలో జరిగిన ఇండోర్ నేపాల్ తైక్వాండో ఛాంపియన్ షిప్లో బంగారు పథకాలు సాధించడం గర్వకారణమన్నారు. ఒలంపిక్ స్థాయికి ఎదిగి తల్లిదండ్రులకు, గురువులకు, ప్రాంతానికి గొప్ప పేరు తీసుకువచ్చేలా కృషి చేయాలని తెలిపారు.
అమ్మాయిలు మార్షల్ ఆర్ట్స్ వంటివి నేర్చుకోవాలని, సమాజంలో ధైర్యంగా ముందుకు సాగుతారని సూచించారు. కార్యక్రమంలో మాస్టర్ రాజు, స్వేరోస్ ఇంటర్నేషనల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు లక్నాపూర్ రాజు, డాక్టర్ గంగరాజు, సీనియర్ కోచ్ ఎండి ఇర్ఫాన్, మసూద్, అనిల్, ఇమామ్, సల్మాన్ ముక్తార్, మహేశ్ పాల్గొన్నారు.