ధారూరు : సమాజ విలువలతో కూడుకోని మార్పు కోరే చిత్రాలను తీయాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. బుధవారం ధారూరు మండలంలోని నాగసముందర్ గ్రామంలో వికారాబాద్ జిల్లా బోంరాస్పేట్ మండలం మెట్లకుంట గ్రామానికి చెందిన సాప్ట్వేర్ ఉద్యోగి పిఏ నాయుడు నిర్మించిన కఠారి కృష్ణ సినిమా బ్యానర్ను ఎమ్మెల్యే విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనంద్ మాట్లాడుతూ సినిమా రంగంలోకి మన జిల్లా వాసి వెళ్లడం సంతోషకరమని అన్నారు.
ఈ నెల 10వ తేదిన విడుదల అవుతున్న సినిమాను ప్రజలు ఆదరించి విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో నిర్మాత సోదరుడు వెంకటయ్య, స్నేహితులు అశోక్ గౌడ్, ప్రజా ప్రతి నిధులు, నాయకులు పాల్గొన్నారు.