వికారాబాద్ : అనంతపద్మనాభస్వామి జాతర ఉత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. సోమవారం చక్రతీర్థంతో ఉత్సవాలు ముగిసాయి. ఉత్సవాలు చివరి రోజు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. రావి చెట్టు కింద మహిళలు దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు దూర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ సమీపంలోని భగీరథ గుండంలో స్వామివారికి చక్రస్నానం చేయించి ఆలయం వరకు పల్లకిలో ఊరేగించారు.
చక్రతీర్థంతో జాతర ఉత్సవాలు ముగిశాయని ఆలయ అధికారులు తెలిపారు. డిసెంబర్ 7న ఉదయం 10గంటలకు ఆలయ హుండీని లెక్కించడం జరుగుతుందని ఆలయ ఫౌండర్ పద్మనాభం, ఆలయ ఈవో నరేందర్ తెలిపారు.