వికారాబాద్ : కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ బ్యాంకులను ప్రైవేటీకరణ చేయొద్దని బ్యాంకు ఉద్యోగులు తెలిపారు. శుక్రవారం వికారాబాద్ ఎస్బీఐ, కేనరా బ్యాంక్ తదితర బ్యాంకుల యూనియన్ ఆధ్వర్యంలో ఉద్యోగుల ధర్నా రెండో రోజుకు చేరింది. ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులు మాట్లాడుతూ.. ప్రభుత్వరంగ సంస్థలైన బ్యాంకులను ప్రైవేటీకరణ చేయడం వలన ఆ బ్యాంకులో విలీనమైన ఎన్నో బ్యాంకులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతాయన్నారు. ప్రజల కోసం, రైతుల కోసం పని చేస్తున్న బ్యాంకులను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడం సరికాదన్నారు.
పేరుకు ఒకటి, రెండు బ్యాంకులే కాని వాటిలో విలీనమైనవి దాదాపు 17బ్యాంకులు సైతం ప్రైవేటీకరణ చేసినట్లే అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎస్బీఐ, కేనరాబ్యాంక్, వికారాబాద్, ఆలంపల్లి, నాగసముందర్ తదితర బ్యాంకు ఉద్యోగులు ధర్నాలో పాల్గొన్నారు.