మోమిన్పేట : మండల కేంద్రంలోని ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రన్ని జిల్లా అధికారి మురళీ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆస్పత్రిలోని రికార్డులను, మందులను, మౌలిక సదుపాయాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మందులు, మౌలిక సదూపాయలు కల్పించాలన్నారు. అనంతరం ఆస్పత్రికి అవసరమైన పరికరాలను అందుబాటులో ఉన్నాయా లేదా అని ఆస్పత్రి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మోమిన్పేట వైద్యా సిబ్బంది పాల్గొన్నారు.