కులకచర్ల : ప్రభుత్వం ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి పథకం పేద ప్రజలకు ధైర్యాన్ని నింపుతుందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. బుధవారం కులకచర్ల మండల కేంద్రంలో రైతువేదిక భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కల్యాణలక్ష్మి ద్వారా ఆడపిల్లలు కుటుంబాల్లో ధైర్యం ఏర్పడిందన్నారు. ఆడ పిల్లల తల్లిదండ్రులు ఇబ్బందులు పడకుండా సీఎం కేసీఆర్ తనవంతుగా పెద్దన్న పాత్ర పోషిస్తున్నారన్నారు. ప్రభుత్వం ద్వారా పెళ్లికి సహాయం చేయడం దేశంలో ఎక్కడా లేదన్నారు. పేదల అభివృద్ధి సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు దేశంలోనే లేవన్నారు.
కార్యక్రమంలో ఎంపీపీ సత్యమ్మ, మార్కెట్ కమిటీ చైర్మన్ హరికృష్ణ, పీఏసీఎస్ వైస్ చైర్మన్ నాగరాజు, మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు రాజు, కులకచర్ల మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు శేరి రాంరెడ్డి, ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్, టీఆర్ఎస్ యువజన విభాగం మండల అధ్యక్షుడు లక్ష్మణ్, టీఆర్ఎస్ కార్యకర్తలు, అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.