వికారాబాద్ : భక్తి శ్రద్ధలతో భగవంతున్ని ప్రార్థిస్తే ముక్తి మార్గం లభిస్తుందని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తెలిపారు. ఆదివారం వికారాబాద్ పట్టణంలోని ప్రశాంతినగర్ కాలనీలో భగవాన్ సత్యసాయి జ్ఞాన కేంద్ర దేవాలయంలో శివలింగానికి మహా రుద్రాభిషేకం నిర్వహించారు. శివలింగానికి అర్చకులు వేద మంత్రోచ్చరణలతో పూజలు చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని ప్రత్యేక పూజలు అభిషేకాలు చేశారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్ చైర్పర్సన్ మంజులరమేశ్ కుమార్, పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ ముత్యంరెడ్డి, మండల అధ్యక్షుడు కమాల్రెడ్డి, జ్ఞాన కేంద్రం నిర్వాహకులు హారతి ద్వారక్నాథ్, డాక్టర్ సత్యనారాయణగౌడ్, బందెప్పగౌడ్, పార్టీ నాయకులు పాల్గొన్నారు.