వికారాబాద్ : గ్రామాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులకు త్వరగా పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్ తెలిపారు. మంగళవారం వికారాబాద్ మండల పరిధిలోని కొటాలగూడ గ్రామంలోని నర్సరీ, కంపోస్ట్షెడ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి చేపడుతున్న పనులను గ్రామస్థాయిలో పూర్తి చేసేలా సంబంధిత అధికారులు చొరవ చూపాలన్నారు. నర్సరీలో మొక్కల పెంపకంపై అవగాహన కల్పించి త్వరగా పనులు చేపట్టాలన్నారు. నర్సరీలో మొక్కలకు రోజుకు రెండుసార్లు నీరు పట్టాలని సూచించారు.
కంపోస్ట్ షెడ్లో ఎరువును తయారు చేసి హరితహారంలోని నాటిన మొక్కలకు వేయాలన్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు కలిసి గ్రామాన్ని అభివృద్ధి పర్చాలని వివరించారు. కార్యక్రమంలో ఎంపీడీవో సత్తయ్య, ఎంపీవో నాగరాజు, సర్పంచ్ రాములునాయక్, కార్యదర్శి రమాదేవి పాల్గొన్నారు.