వికారాబాద్ : స్వచ్ఛ సర్వేక్షణ్ 2022లో మెరుగైన ర్యాంకు సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ మంజుల తెలిపారు. బుధవారం వికారాబాద్ పట్టణంలోని 28వ వార్డు గాంధీ కాలనీలో కళాబృందం వారిచే పట్టణ ప్రజలకు అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇంటి ముందు, ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, తడి, పొడి చెత్తలను వేరు చేసి ఇంటి ముందుకు వచ్చే పారిశుధ్య కార్మికులకు అందివ్వాలన్నారు.
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం మనందరి బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ స్వాతి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రమేశ్కుమార్, మేనేజర్ కుమార్, ఎస్ఐ నాగరాజు, నాయకులు రాజ్కుమార్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.