పరిగి టౌన్ : కొనుగోలు చేసిన భూమిని పట్టా చేయడం లేదని గ్రామంలో పంచాయతీ పెట్టిన తమకు న్యాయం జరుగడం లేదని గురువారం పరిగి మండల పరిధిలోని సయ్యద్పల్లి గ్రామానికి చెందిన ఓ కుటుంబం తాసిల్దార్ కార్యాలయం ఎదుట పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన పగిడ్యాల వీరప్ప పేరిట ఉన్న 8.36 ఎకరాల భూమిని తమకు 4.18 ఎకరాల భూమి, అదే విధంగా తన పెద్ద నాన్న నారాయణకు 4.18 ఎకరాల భూమిని విక్రయించారు.
అట్టి భూమిని తన పెద్ద నాన్నకు రిజిస్ట్రేషన్ చేసి, తమకు మాత్రం రిజిస్ట్రేషన్ చేయడం లేదని బాధితులు జంగయ్య, భార్య జంగమ్మ, ఆమె కుమారుడు గణేష్ తాసిల్దార్ కార్యాలయం ఎదుట పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యప్రయత్నానికి ప్రయత్నించారు. కార్యాలయం సిబ్బంది వారిని నిలువరించి విక్రయించినట్లు సరైన పత్రాలు ఉంటే మీకు న్యాయం చేస్తామని అందుకు సంబంధించిన ఏవైనా పత్రాలు ఉంటే తమకు చూపించాలని సూచించడంతో తమ దగ్గర కేవలం తెల్లపేపర్పై అమ్మినట్లు మాత్రమే రాసి ఇచ్చినట్లు ఉందని బాధితులు తెలిపారు.
కార్యాలయం ప్రక్కనే ఉన్న పోలీసులకు సమాచారం తెలువడంతో వెంటనే బాధితులను పోలీస్టేషన్కు తీసుకువెళ్లారు.