వికారాబాద్ : కార్తీక మాసం పురస్కరించుకోని అనంతపద్మనాభస్వామి దేవాలయంలో పెద్ద ఎత్తున జాతర జరుగుతోంది. శనివారం స్వామివారిని ఆలయ సమీపంలో ఉన్న భగీరథ గుండంలో అర్చకుల మంత్రోచ్ఛరణల మధ్య స్నానాలు అచారించి అలంకరించారు. సన్నాయి మేళాలతో స్వామివారిని గరుడ వాహనంపై మాడ వీధుల్లో ఊరేగించారు. ఊరేగింపులో దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ పురవీధులన్ని పద్మనాభస్వామి నామస్మరణతో మారుమోగాయి.
ఆలయానికి వచ్చిన భక్తులకు ఆలయ అధికారులు తగు ఏర్పాట్లు చేశారు. శుక్రవారం రాత్రి స్వామివారి రథోత్సవం కన్నుల పండువగా సాగింది. స్వామివారి రథోత్సవంలో వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ పాల్గొన్నారు. కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.