వికారాబాద్, మార్చి 22 : నోడల్ అధికారు లు బాధ్యతాయుతంగా పనిచేయాలని..అన్ని అంశాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని వికారాబాద్ అదనపు కలెక్టర్ రాహుల్శర్మ సూచించారు. శుక్రవారం ఆయన తన చాం బర్లో వికారాబాద్ నియోజకవర్గానికి చెం దిన నోడల్ అధికారులతో సమావేశమయ్యా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎక్కడా.. ఏ చిన్న తప్పిదానికి ఆస్కారం ఇవ్వ కుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్, మ్యాన్పవర్ తదితర వాటిని ఏర్పాటు చేసుకోవాలని.. ఫ్లయింగ్, ఎస్ఎస్ఎస్టీ, ఎఫ్ఎస్టీ బృందాలను పూర్తి స్థాయిలో పనిచేసేలా చూడాలన్నారు.
నిఘా బృందాలు తమకు కేటాయించిన ప్రదేశాల్లో విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలన్నా రు. సువిధ యాప్ ద్వారా అనుమతులు జారీ చేయాలన్నారు. పోలింగ్స్టేషన్లు, రూట్ మ్యా పు చూసుకోవాలని, బీఎల్వోలు పోలింగ్ కేంద్రాల్లోని ఓటరు జాబితాను సరిచూసుకోవాలన్నారు. 85 ఏండ్లు పైబడిన వారికి, దివ్యాంగులకు ఇంటి నుంచే ఓటు వేసే వెసులుబాటు ఉండడంతో ఫారం -12డీలను అర్హులకు అందించాలన్నారు. పౌరులకు ఎన్నికలపై సందేహాలుంటే 1950 హెల్ప్లైన్ నం బర్కు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చు నన్నారు.
అక్రమంగా డబ్బు, మద్యం సరఫరా, ప్రలోభాలు, బహుమతులు ఇవ్వడం వంటి వాటిని పకడ్బందీగా నియంత్రించాలని ఆదేశించారు. సీ-విజిల్ యాప్ ద్వారా కానీ 1950 టోల్ ఫ్రీ లేదా కంట్రోల్ రూంకు ఫిర్యాదులొస్తే 15 నిమిషాల్లోనే ఘటనాస్థలికి చేరుకోవాలన్నారు. ఎన్నికల కోడ్ను ప్రతి ఒక్కరూ కచ్చితంగా పాటించాలన్నారు. రాజకీయ ప్రకటనలకు సంబంధించి మీడియా సర్టిఫికేషన్, మానిటరింగ్ కమిటీ తదితర వాటిని సంబంధిత అధికారి చూడాలన్నారు. సమావేశంలో డీఎస్పీ శ్రీనివాస్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ జాకీర్అహ్మద్, తహసీల్దార్లు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా జిల్లాలోని వికారాబాద్ నియోజకవర్గానికి కేటాయించిన ఈ వీఎంలను భద్రపరిచేందుకు ముందస్తు ఏర్పాట్లు చేయాలని అధికారులను వికారాబాద్ అదనపు కలెక్టర్ రాహుల్శర్మ ఆదేశించారు. శుక్రవారం వికారాబాద్ నియోజకవర్గానికి సంబంధించి డిస్ట్రిబ్యూషన్, స్ట్రాంగ్రూమ్ ఏర్పాటుకు మేరినాట్ ఉన్నత పాఠశాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని .. స్కూల్ పరిధిలో ఉన్న పిచ్చి మొక్కలను తొలగించి శుభ్రంగా ఉంచాలన్నారు.