వికారాబాద్ : వికారాబాద్ పట్టణంలోని దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆలంపల్లి అనంత పద్మనాభస్వామిని హంస వాహనంపై తిప్పారు. ఈ ఊరేగింపులో పట్టణ ప్రజలు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. బజా బాజంత్రీలతో స్వామివారిని ఆలయ పురవీధుల్లో ఊరేగించారు. ఈ ఊరేగింపులో పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు.