కేశంపేట, మార్చి 22 : శోభకృత్ నామ సంవత్సరంలో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ఆకాక్షించారు. ఉగాది పర్వదినం సందర్బంగా కేశంపేట మండలం ఎక్లాస్ఖాన్పేటలోని లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయంలో బుధవారం ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ప్రజలతో కలిసి పంచాంగ శ్రవణంలో పాల్గొన్నారు. కార్యక్రమాల్లో ఎంపీపీ రవీందర్యాదవ్తో పాటు ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.
షాద్నగర్లో..
షాద్నగర్టౌన్ : ఉగాదిని పురస్కరించుకుని పట్టణంలో తమ ఇష్ట దైవాలకు పచ్చడిని, భక్షాలను నైవేద్యంగా సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. పట్టణంలోని శివమారుతి గీతా అయ్యప్ప మందిరం, వేంకటేశ్వరస్వామి, సత్యనారాయణస్వామి, కన్యకాపరమేశ్వరి, చౌడమ్మగుట్ట వీరాంజనేయస్వామి, సాయిబాబా ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టణంలో ఎక్కడా చూసిన మామిడి తోరణాలతో పచ్చని పండుగ వాతావరణం నెలకొంది.
కొత్తూరులో..
కొత్తూరు : ఉగాది వేడుకలను మండలంలో ఘనంగా జరుపుకున్నారు. కొత్తూరు మారుతి హనుమాన్ ఆలయంలో పూజారి నాగరాజు శర్మ ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం వినిపించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దేవేందర్యాదవ్ పాల్గొన్నారు.
నందిగామలో..
నందిగామ : మండల పరిధిలో ఉగాది పర్వదినం సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నంలో..
ఇబ్రహీంపట్నం/ఇబ్రహీంపట్నం రూరల్ : ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో బుధవారం ఉగాది వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. శోభకృత్ నామ సంవత్సరానికి స్వాగతం పలికారు. తీపి వంటలతో పాటు ఉగాది పచ్చడి తయారు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పండుగ సందర్భంగా గ్రామాల్లో సందడి నెలకొంది. పలువురు రైతులు వ్యవసాయ పనులను ప్రారంభించారు. మామిడి తోరణాలతో ఇండ్లను అలంకరించారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలోని త్రిశక్తి, ఈశ్వరాంజనేయస్వామి, లక్ష్మీనర్సింహాస్వామి ఆలయాల్లో పంచాగ శ్రవణం నిర్వహించారు. డివిజన్ పరిధిలోని మంచాల, యాచారం, ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్మెట్ మండలాలతో పాటు ఆదిబట్ల, తుర్కయంజాల్, పెద్దఅంబర్పేట్, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీల్లో ప్రజలు పండుగను అత్యంత భక్తిశ్రద్దలతో జరుపుకున్నారు.
పెద్దఅంబర్పేటలో..
పెద్దఅంబర్పేట : మున్సిపాలిటీ పరిధిలో ఉగాది సంబురాలు ఘనంగా నిర్వహించారు. ఆలయాల్లో ప్రజాప్రతినిధులు, గ్రామపెద్దల సమక్షంలో పండితులు పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఏ రాశుల వారికి ఎలాంటి ఫలాలు అందుతాయో తెలియజేశారు. పలుచోట్ల ఆలయాల్లో భక్తులకు ఉగాది పచ్చడి పంపిణీ చేశారు.
కడ్తాల్లో..
కడ్తాల్ : మండల పరిధిలోని మైసిగండిలో కొలువైన మైసమ్మ తల్లి ఆలయంలో ఉగాదిని పురస్కరించుకొని భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాదారం గ్రామానికి చెందిన శ్రీరాములుగౌడ్ కుటుంబ సభ్యులు ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి భక్తులకు ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ చైర్మన్ శిరోలీపంతూనాయక్, ఈవో స్నేహలత, సర్పంచ్లు లక్ష్మీనర్సింహారెడ్డి, తులసీరాంనాయక్, పీఏసీఎస్ డైరెక్టర్ వెంకటేశ్, నరేందర్రెడ్డి, అశోక్, శ్రీరాములుగౌడ్, లక్ష్మీనారాయణగౌడ్, యాదగిరిగౌడ్, గణేశ్గౌడ్, విజయ్గౌడ్, రామస్వామి, రాజేశ్, వెంకటేశ్, మహేశ్, శివగౌడ్, రామకృష్ణ, అఖిల్, జంగయ్య, మహేందర్, జ్ఞానేశ్వర్, యాదమ్మ, జంగమ్మ, అలివేలు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. మండల కేంద్రంతోపాటు పరిధిలోని ఆయా గ్రామాల్లో ఉగాది పండుగ సందర్భంగా ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండల కేంద్రంలోని లక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయంలో గ్రామ ప్రధాన పురోహితుడు మెళ్లూరి వెంకటేశ్వరశర్మ పంచాంగ శ్రవణం నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి, ఉప సర్పంచ్ రామకృష్ణ, ఆంజనేయులు, భాస్కర్రెడ్డి, నరేందర్రెడ్డి, వెంకట్రెడ్డి, హన్మానాయక్, సాయిరెడ్డి, వెంకటేశ్, రాఘవేందర్, రాములు, వెంకటయ్యగౌడ్, జంగారెడ్డి, ఈశ్వరప్ప, శేఖర్రెడ్డి, అంజయ్య, శ్రీనివాస్, రాఘవాచారి, మల్లేశ్గౌడ్, శ్రీకాంత్, బాబు, ఆలయ అర్చకులు శ్రీధర్, శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు.
చేవెళ్ల నియోజకవర్గంలో..
షాబాద్ : ఉగాదిని పురస్కరించుకుని బుధవారం నియోజకవర్గ పరిధిలోని షాబాద్, చేవెళ్ల, మొయినాబాద్, శంకర్పల్లి మండలాల్లోని ఆయా గ్రామాల్లోని హనుమాన్ ఆలయాల్లో వేదపండితుల ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు, యువకులు పాల్గొన్నారు.
చేవెళ్లటౌన్ : ఉగాది వేడుకలను చేవెళ్ల పట్టణంంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని హన్మాన్ ఆలయంలో పూజారులు పచ్చడి తయారు చేసి భక్తులకు పంపిణీ చేశారు. పంచాం గ శ్రవణం వినిపించారు. శోభకృత్ నామ సంవత్సరం అంతా మంచి జరగాలని కోరుకుంటున్నట్లు చేవెళ్ల ఎంపీపీ విజయలక్ష్మి, జడ్పీటీసీ మాలతి, సర్పంచ్ శైలజాఆగిరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ దేవర వెంకట్రెడ్డి భగవంతుడిని వేడుకున్నామన్నారు.
చేవెళ్ల రూరల్ : ఉగాది పర్వదినం సందర్భంగా చేవెళ్ల మండల పరిధిలోని పలు ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. బుధవారం భక్తులు ఆలయాలకు వెళ్లి పంచాంగ శ్రవణం విన్నారు. కేసారం గ్రామంలో పూజారి శ్రీపాద ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం వినిపించారు.
శంకర్పల్లిలో..
శంకర్పల్లి : ఉగాది సందర్భంగా మండలంలో ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయాల్లో పూజారులు పంచాంగ శ్రవణం వినిపించారు.
మంచాలలో..
మంచాల : మండల పరిధిలో ఉగాది వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. అస్మత్పూర్లో ఏపీఎల్ క్రికెట్ కీడోత్సవాలను సర్పంచ్ నౌసు హరిప్రసాద్ ప్రారంభించారు. వివిధ గ్రామాల్లోని ఆలయాల్లో పంచాంగ శ్రవణం చదివి వినిపించారు. కార్యక్రమంలో సర్పంచ్లు విష్ణు వర్ధన్రెడ్డి, నాగరాజు గౌడ్, బాల్రాజ్, శ్రీనివాస్రెడ్డి, ఎల్లంకి అనిత, సపావట్ పద్మానాయక్ తదితరులు పాల్గొన్నారు.