కులకచర్ల, జూన్ 14 : ఈ శ్రామ్కార్డుతో రూ. రెండులక్షల బీమా సదుపాయం లభిస్తున్నదని జన్సహాస్ స్వచ్ఛంద సంస్థ జిల్లా కోఆర్డినేటర్ ప్రకాశ్కుమార్ అన్నారు. మంగళవారం చౌడాపూర్ మండల కేంద్రంలో ఈ శ్రామ్కార్డులపై గ్రామస్తులకు అవగాహన కల్పిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈశ్రామ్ కార్డు పొందడం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను పొందేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రమాదవశాత్తు మృతి చెందితే రెండు లక్షల బీమా వర్తిస్తుందని, అంగవైకల్యం పొందితే లక్ష బీమా వర్తిస్తుందన్నారు. ఈ శ్రామ్ కార్డును తమ సంస్థ ద్వారా ఉచితంగా అర్హులకు అందజేస్తున్నామని తెలిపారు.
భవననిర్మాణ కార్మికులకు లేబర్ కార్డు తీసుకుంటే ఇద్దరు కూతుర్ల వివాహానికి రూ. 30వేల చొప్పున వివాహకానుక లభిస్తుందన్నారు. డెలివరి అయితే ప్రసూతి కానుక పేరుతో 30వేలు వస్తాయన్నారు. లేబర్ కార్డు ఉన్నవారికి సాధారణ మరణం పొందితే 1,30,000 బీమా వస్తుందని, ప్రమాదవశాత్తు మృతి చెందితే 6,30,000 వస్తాయని తెలిపారు. అనంతరం వన్నేషన్ వన్ రేషన్ కార్డుపై అవగాహన కల్పించారు. రేషర్ ద్వారా దేశంలో ఎక్కడి నుంచైనా రేషన్ సరుకులు పొందడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో చౌడాపూర్ వార్డు సభ్యుడు అశోక్, జన్సహాజన్ సంస్థ కోఆర్డినేటర్ రవి, ఎంపీటీసీ శంకర్ పాల్గొన్నారు.