కొడంగల్ : మండలంలోని హస్నాబాద్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి, ఎంపీపీ మద్దప్ప దేశ్ముఖ్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఆదివారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేకు నాయకులు, కార్యకర్తలు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలపడంతో పాటు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరారు. పెద్ద బోయిన నారాయణ, శివరాజ్, బోవనప్ప, హన్మప్ప, రాములు, చంద్రప్ప, రాములు, తిరమలమ్మ, ఆశప్ప, మనోహర్, సూర్యప్రకాశ్, మల్లేష్, వెంకటయ్య, నందకుమార్, సాయిలు కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్లో చేరారు. టీఆర్ఎస్ చేస్తున్న ప్రజా సంక్షేమం, కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధిపై ఎమ్మెల్యే చూపుతున్న శ్రద్ధకి ఆకర్శితులై పార్టీలో చేరమన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా సంక్షేమానికి టీఆర్ఎస్ అండగా నిలుస్తుందని, సీఎం కేసీఆర్తోనే తెలంగాణ ప్రగతి ఆధారపడి ఉందని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యేకు నియోజకవర్గ టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు, ప్రజలు ప్రత్యేకంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో నియోజవర్గంలోని కొడంగల్, బొంరాస్పేట, దౌల్తాబాద్, కోస్గి, మద్దూర్ మండలాల టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.