వికారాబాద్, ఆగస్టు 6 : తెలంగాణ కోసం జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్సార్ అని, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్పటేల్ అన్నారు. ఆదివారం ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా వికారాబాద్ ఎంపీడీవో కార్యాలయం ముందు ఉన్న ఆయన విగ్రహానికి పూల మాల వేసిన నివాళులర్పించారు. జిల్లా కలెక్టరేట్లో జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాల వేసి అధికారికంగా జరిపారు. జడ్పీ వైస్ చైర్మన్ విజయ్కుమార్, వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ మంజులారమేశ్, వికారాబాద్ ఎంపీపీ చంద్రకళ, ఎంపీడీవో సత్తయ్య జయశంకర్సార్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పిం చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తొలి, మలి దశ ఉద్యమానికి పునాది వేసిన జయశంకర్ సార్ స్ఫూర్తి గొప్పదని కొనియాడారు. స్పూర్తి ప్రదాతగా తెలంగాణ ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచి ఉంటారన్నారు. జయశంకర్సార్ ఆశయాలను సీఎం కేసీఆర్ నెరవేరుస్తున్నట్లు తెలిపారు. జయశంకర్సార్ అడుగు జాడల్లో నడుస్తూ ఆయన ఆశయ సాధనకు కృషి చేయడం ఆయనకు నిజమైన నివాళ్లి అర్పించిన వారమవుతామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి ఉపేందర్, కోటాజీ, తెలంగాణ ఉద్యమ కారులు శ్రీనివాస్, సుజిత్, కేదర్నాథ్, తిరుపతిరెడ్డి, మారుతి, శంకర్, కృష్ణయ్య, మహేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తాండూరు: ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి వేడుకలను ఆదివారం తాండూరు నియోజకవర్గంలో బీఆర్ఎస్, జేఏసీ, తెలంగాణ విద్యావంతుల వేదికతో పాటు రాజకీయ పార్టీల నేతల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని జయ శంకర్ సార్ విగ్రహానికి నేతలు, ఉపాధ్యాయులు, విద్యావంతులు, ఉద్యోగులు పూల మా లలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నేతలు, అధికారులు మా ట్లాడుతూ ఆచార్య జయశంకర్ సారు చూపిన ఉద్యమ బాటలో నడుస్తూ బంగారు తెలం గాణ సాధించుకుందామని పిలుపునిచ్చారు. జీవితమంతా తెలంగాణ కోసం తపించిన జయశంకర్ సార్ స్ఫూర్తిని మనం నిత్యం గుర్తుకు తెచ్చుకోవాలని పేర్కొన్నారు.
బొంరాస్ట: ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతిని ఆదివారం మండలంలో ఘనంగా నిర్వహించారు. మండల పరిషత్ కార్యాలయం, ఎంఆర్సీ ఆవరణలో ఉన్న జయశంకర్ విగ్రహానికి తహసీల్దార్, టీవీవీ రాష్ట్ర కార్యదర్శి రవీందర్గౌడ్, జిల్లా నాయకులు బా కారం చంద్రశేఖర్, ఉపాధ్యాయ సంఘాల నాయకులు గోపాల్, ఉపాధ్యాయులు పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు జయశంకర్ చేసిన పోరాటం మరువ లేనిదని కొనియాడారు.
కొడంగల్: మండల పరిధిలో ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో జయశంకర్ సార్ జయంతిని జరుపుకున్నారు. ఇందులో భాగంగా స్థానిక తహసీల్దార్ కార్యా లయంలో సిబ్బంది సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమ ంలో వీఆర్ఏల సంఘం జిల్లా అధ్యక్షులు గోపాల్ సిబ్బంది కిష్టప్ప, రాములు పాల్గొన్నారు.
ధారూరు: ధారూరు మండల కేంద్రంలో ఆచార్య జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ధారూరు గ్రామ సర్పంచ్ చంద్రమౌళి, నాయకులు జైపాల్ రెడ్డి, మహేశ్, లక్ష్మయ్య, అంజయ్య, తదితరులు ఉన్నారు
కులకచర్ల: కులకచర్ల మండల విశ్వకర్మ(విశ్వబ్రాహ్మణ) సంఘం ఆధ్వర్యంలో జయ శంకర్ సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జయశంకర్ సార్ చేసిన సేవలను కొనియాడారు. ఆయన చిరకాలస్వప్నమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వకర్మ(విశ్వబ్రాహ్మణ) సంఘం అధ్యక్షుడు వడ్ల చిన్నయ్యచారి, సంఘం నాయకులు రాఘవేంద్రచారి, విశ్వేంద్రచారి, చంద్రమోహన్చారి, శ్రీనివాస్చారి, అశోక్చారి, మాజీ ఎంపీటీసీ మాలె కృష్ణయ్యగౌడ్, సంఘం సభ్యులు పాల్గొన్నారు.