పరిగి : ఇతర జిల్లాల నుంచి వికారాబాద్ జిల్లాకు కేటాయించబడిన ఉపాధ్యాయుల బదిలీల కౌన్సిలింగ్ చేపట్టారు. డీపీఆర్సి భవనంలో గురువారం వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల అధ్యక్షతన ఉపాధ్యాయుల కౌన్సిలింగ్ నిర్వహించారు. మూడు రోజులపాటు ఉపాధ్యాయుల కౌన్సిలింగ్ జరిగింది. మంగళవారం 18మందికి, బుధవారం 58మందికి గురువారం 877మందికి మొత్తం 953మంది ఉపాధ్యాయులకు బదిలీల కౌన్సిలింగ్ నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య, జిల్లా విద్యాధికారి రేణుకాదేవి పాల్గొన్నారు.