ఆర్కేపురం : దివ్యాంగులకు చేయూతనిచ్చేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని లయన్స్క్లబ్ హైదరాబాద్ ధరణి కార్యదర్శి కోట్ల రామ్మోహన్రావు అన్నారు. శుక్రవారం ఆయన జన్మదినం సందర్భంగా వనస్థలిపురంలోని దివ్యాంగుల గృహంలో జన్మదిన వేడుకలను జరుపుకోని 200 మందికి అన్నదానం చేశారు. ఈ సందర్భంగా రామ్మోహన్రావు మాట్లాడుతూ సమాజంలోని దివ్యాంగుల, అనాధలకు సహాయసహకారాలు అందించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పేర్కొన్నారు.
దివ్యాంగులను మన పిల్లలుగా భావించి వారిలో మనోధైర్యాన్ని నింపాలని సూచించారు. దివ్యాంగుల మధ్య తన జన్మదిన వేడుకలు జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. సమాజంలోని దివ్యాంగులు, అనాధ, నిరుపేద ప్రజల సేవే లక్ష్యంగా లయన్స్క్లబ్ హైదరాబాద్ ధరణి ముందుకెళ్తుందన్నారు. సాటివారికి సహాయం చేయడంలోనే ఆనందం ఉంటుందని పేర్కొన్నారు.