బడంగ్పేట:కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ మారయ్య కథనంప్రకారం బీఎన్రెడ్డి సమీపంలోని సాగర్ హౌసింగ్ కాంప్లెక్స్లో నివాసం ఉంటున్న మురళీధర్ (53) ఇంట్లో ఎవరు లేని సమయంలో చున్నీతో ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
మురళీధర్కు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం వారు వేర్వేరుగా ఉంటున్నారు. కాగా మురళీధర్ ఇంటినుంచి వాసన రావడంతో ఆయన సోదరి సునీత కిటికిలోంచి చూసి స్థానికుల సహాయంతో పోలీసులకు పోన్ చేసినట్టు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.