ఇబ్రహీంపట్నం రూరల్, నవంబర్ 25 : తుర్కగూడ, కర్ణంగూడ, చర్లపటేల్గూడ, కప్పాడుతో పాటు ఇతర గ్రామాల ప్రజలు రోడ్లు సరిగా లేక ఎన్నో ఏండ్లుగా ఎదుర్కొంటున్న రవాణా కష్టాలు తొలగిపోయాయి. తుర్కగూడ నుంచి కర్ణంగూడ, పోచారం, ఉప్పరిగూడ గ్రామాల మీదుగా నేరుగా నగరానికి చేరుకునే రోడ్డు పనులు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి ప్రత్యేక చొరవతో పూర్తి కావడంతో ఆయా గ్రామాల ప్రజలు, రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ రోడ్డు వెంబడి పెద్దకాల్వపై ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని ప్రభుత్వం నుంచి రూ.2.88 కోట్లు విడుదల చేయించి పూర్తి చేయించారు.
బ్రిడ్జి నిర్మాణం పూర్తయిన వెంటనే రూ.4.76 కోట్ల నిధులు మంజూరు చేయించి రోడ్డు పనులు త్వరితగతిన పూర్తి చేయించారు. సుమారు 8.10 కిలోమీటర్ల మేర రోడ్డు పనులు పూర్తి కావడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కప్పాడు, తుర్కగూడ, చర్లపటేల్గూడ, కర్ణంగూడ గ్రామాల్లో రైతులు ఆకుకూరలు ఎక్కువగా సాగు చేస్తుంటారు. ప్రతిరోజు ఇబ్రహీంపట్నం మీదుగా నగరానికి వెళ్లాల్సి ఉండేది. రోడ్డు పనులు పూర్తి కావడంతో మార్గం సుగమం అయ్యింది. ఇచ్చిన మాటను నెరవేర్చినందుకు ఎమ్మెల్యే కిషన్రెడ్డి జనం కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
నిత్యం కూరగాయలను నగరానికి తరలించాలంటే ఇబ్రహీంపట్నం మీదుగా వెళ్లాల్సిందే. ఎమ్మెల్యే ప్రత్యేక చొరవతో కర్ణంగూడ మీదుగా నేరుగా సాగర్హ్రదారికి చేరుకునేందుకు రోడ్డు వేయడంతో దూరభారం తగ్గింది. ఇప్పుడు ఏ ఇబ్బందులు లేకుండా నగరానికి వెళ్లి వస్తున్నాం.
– కంబాలపల్లి హన్మంత్రెడ్డి, రైతు, చర్లపటేల్గూడ
కర్ణంగూడ-పోచారం వంతెన నిర్మాణ పనులు పూర్తి చేయడంతో పాటు సుమారు 8.10కి.మీ మేర బీటీ రోడ్డు వేసినందుకు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు. తుర్కగూడ, కప్పాడు, చర్లపటేల్గూడ, పోచారం గ్రామాల రైతులకు రవాణా కష్టాలు తొలిగిపోయాయి. రోడ్డు నిర్మాణం పూర్తి కావడం సంతోషకరం.
– ఏనుగు భరత్రెడ్డి, ఎంపీటీసీ తుర్కగూడ