మొయినాబాద్, మార్చి 17 : రైతులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, డీసీసీబీ చైర్మన్ బి.మనోహర్రెడ్డి అన్నారు. సురంగల్-మొయినాబాద్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) నూతన భవన నిర్మాణానికి తహసీల్దార్ కార్యాలయం ఆవరణంలో భూమిపూజ, శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర సర్కార్ సహకార సంఘాల ద్వారా రైతులకు రుణాలను ఇప్పించి వారి ఆర్థిక బలోపేతానికి కృషి చేస్తుందని పేర్కొన్నారు. రైతులకు పంట రుణాలతో పాటు దీర్ఘకాలిక రుణాలను కూడా ఇప్పించి వారి అభ్యున్నతికి కృషి చేస్తున్నామని చెప్పారు. పీఏసీఎస్ భవన నిర్మాణానికి స్థలం కేటాయించడం అభినందనీయమని అన్నారు.
కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ ఎం.చంద్రారెడ్డి, ఎంపీపీ గునుగుర్తి నక్షత్రం, జడ్పీటీసీ కాలె శ్రీకాంత్, వైస్ ఎంపీపీ మమత, పీఏసీఎస్ వైస్ మహేందర్, డైరెక్టర్లు జగన్మోహన్రెడ్డి, రాఘవారెడ్డి, యాదయ్య, శ్రీనివాస్, రాంరెడ్డి, భూపాల్రెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ ఎంఏ రావూఫ్, సర్పంచ్లు స్వరూప, నరోత్తంరెడ్డి, నాయకులు పాల్గొన్నారు.