తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూతన సచివాలయ ప్రారంభోత్సవం ఆదివారం అట్టహాసంగా జరిగింది. సీఎం కేసీఆర్తోపాటు మంత్రులు తమకు కేటాయించిన చాంబర్లలో కొలువుదీరారు. ఈ సందర్భంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తనకు కేటాయించిన చాంబర్లో ఆసీనులై ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు ట్యాబ్ల పంపిణీకి సంబంధించిన ఫైల్పై ఆమె తొలి సంతకం చేశారు. బడులు ప్రారంభమయ్యే నాటికి ట్యాబ్లతోపాటు లైబ్రరీ కార్నర్లను పాఠశాలలకు అందిస్తామని చెప్పారు. సచివాలయ ప్రారంభ వేడుకను పురస్కరించుకొని సీఎం కేసీఆర్కు మంత్రి సబితారెడ్డి, ఎంపీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
-ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 30
డా.బీఆర్ అంబేద్కర్ నూతన సచివాలయాన్ని సీఎం కేసీఆర్ ఆదివారం అట్టహాసంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సబితారెడ్డి, ఎంపీలు డా.రంజిత్రెడ్డి, పోతుగంటి రాములు, ఎమ్మెల్సీలు పట్నం మహేందర్రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్రెడ్డి, మెతుకు ఆనంద్, కాలె యాదయ్య, అంజయ్యయాదవ్, రోహిత్రెడ్డి, మహేశ్రెడ్డి, నరేందర్రెడ్డి, రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్పటేల్ సీఎం కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మంత్రి సబితారెడ్డి తనకు కేటాయించిన చాంబర్లో ఆసీనులయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రాథమిక పాఠశాలల్లో పనిచేస్తున్న 19,800 మంది ఉపాధ్యాయులకు రూ.34.25 కోట్లతో ట్యాబ్లు, 5వేల ప్రాథమిక పాఠశాలల్లో లైబ్రరీ కార్నర్లను రూ.7.53 కోట్లతో ఏర్పాటు చేసిన ఫైళ్లపై నూతన సచివాలయంలో తొలి సంతకం చేశారు. పాఠశాలలను తిరిగి ప్రారంభించే నాటికి ట్యాబ్లను ఉపాధ్యాయులకు అందించనున్నట్లు తెలిపారు. లైబ్రరీ కార్నర్లను కూడా జూన్ 12 నాటికి ఏర్పాటు చేస్తారని తెలిపారు. నూతన సచివాలయంలోని మొదటి అంతస్తులోని బీ వింగ్ చాంబర్ నుంచి మంత్రి సబితారెడ్డి తమ విధులను నిర్వర్తించనున్నారు. మంత్రి సబితారెడ్డికి కూడా ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్పర్సన్లు, రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల కార్పొరేషన్ చైర్మన్ రాజావరప్రసాద్, డీసీసీబీ చైర్మన్ మనోహర్రెడ్డి, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి, జేఏసీ ఇబ్రహీంపట్నం నియోజకవర్గ నాయకుడు డాక్టర్ మంద సురేశ్, ఇతర ప్రజాప్రతినిధులు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సచివాలయ రూపకల్పన, నిర్మాణంలో సీఎం కేసీఆర్ పాత్ర అద్వితీయమని పేర్కొన్నారు. కేసీఆర్ లాంటి దూరదృష్టి కలిగిన నాయకుడు రాష్ర్టానికి ముఖ్యమంత్రిగా ఉండటం తెలంగాణ రాష్ట్ర ప్రజల అదృష్టమని, సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరు పెట్టడమే ఆయన ముందు చూపునకు నిదర్శనమని పేర్కొన్నారు. దేశంలో అంబేద్కర్ ఆలోచనలు, ఆశయాల పట్ల నిబద్ధత కలిగిన ఏకైక నాయకుడు కేసీఆర్ అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రగతి చిహ్నంగా సచివాలయం నిలిచిందని తెలిపారు. ముఖ్యమంత్రి ఏ పని చేపట్టినా చరిత్రలో నిలిచిపోతుందని చెప్పారు. సచివాలయ ప్రారంభోత్సవం సందర్భంగా కాంట్రాక్టు ప్రాతిపదికన విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ సీఎం సంతకం చేయడం హర్షణీయమని పేర్కొన్నారు.
– న్యూస్ నెట్వర్క్