ఇబ్రహీంపట్నం, జూలై 30 : ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుం టున్నది. అందులో భాగంగానే విద్యార్థుల్లో ఐరన్, న్యూట్రిషన్ తదితర విటమిన్ల లోపాలు తలెత్తకుండా ఉండేందుకు రాగిజావను పంపిణీ చేయాలని నిర్ణయించింది. రంగారెడ్డి జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో నేటి నుంచి రాగి జావను అందించనున్నారు. ఒక్కో విద్యార్థికీ 200 మిల్లీమీటర్ల చొప్పున ప్రతి సోమ, బుధ, శనివారా ల్లో ఉదయం 10 గంటలకు రాగిజావను అందించనున్నారు. ఇప్పటికే ప్రభుత్వ బడుల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు జరుగుతుండగా.. దానికి తోడుగా రాగిజావనూ అందిస్తే విద్యార్థులకు మ రింత ప్రయోజనకరంగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.
జిల్లాలోని 1,362 పాఠశాలల్లో ..
రంగారెడ్డి జిల్లాలోని 1,362 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 1.40లక్షమంది విద్యార్థినీవిద్యార్థుల కు సోమవారం నుంచి రాగిజావను అందించ ను న్నారు. రాగిజావ పంపిణీకి సంబంధించిన ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. మండలాల వారీ గా సరఫరా చేశారు. వారానికి మూడు రోజులపాటు విద్యార్థులకు ఈ పౌష్టికాహారాన్ని అందించనున్నారు. మధ్యా హ్న భోజనం వడ్డించే వారే ఈ రాగిజావను రెడీ చేయనున్నారు.
విద్యార్థుల సంపూర్ణ ఆరోగ్యం కోసమే..
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు సం పూర్ణ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా సర్కారు బడుల్లో వెనుకబడిన తరగతుల పిల్లలే ఎక్కువగా ఉండటంవల్ల వారిలో చాలామంది ఉద యం వేళ టిఫిన్లు తినకుండానే పాఠశాలలకు వస్తున్నారు. అలాంటి వా రికి ఈ అల్పాహారం ఇస్తే బా గుంటుందని ప్రభుత్వం సంకల్పించింది. ఈ రాగిజావలో విద్యార్థులకు శక్తి ని ఇచ్చే పౌష్టికాహారం ఉంటుంది. అందువల్ల వారంలో మూడు రోజులపాటు ఒక్కో విద్యార్థికీ 200 మిల్లీ లీటర్ల చొప్పున అందించనున్నారు.
వారంలో మూడు రోజులు అందిస్తాం
సర్కారు బడుల్లో చదివే విద్యార్థులు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండేందుకు ప్రభుత్వం వారంలో మూడు రోజులపాటు రాగిజావను పంపిణీ చేయాలని నిర్ణయించింది. నేటి నుంచి జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 1.40 లక్షల మందికి విద్యార్థులకు పంపిణీ చేయనున్నాం. ఇందులో పౌష్టికాహారం ఉండటం తో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
-సుశీందర్రావు, రంగారెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారి
విద్యార్థులకు ఎంతో మేలు..
రాగిజావ పంపిణీతో విద్యార్థుల్లో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. తద్వారా విద్యార్థులు చదువులో రాణించడంతోపాటు ఉత్సాహం గా ఉంటారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా రాగిజావను పంపిణీ చేయడం సంతోషకరం.
– రాజిరెడ్డి, ప్రధానోపాధ్యాయుడు, నోముల ప్రాథమిక పాఠశాల