పేదల సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తున్నది. ఇప్పటికే డబుల్ బెడ్ రూం పథకం కింద నిరుపేదలకు ఇండ్లను నిర్మించి ఇస్తుండగా.. త్వరలో జాగ ఉన్న పేదలకు ‘గృహలక్ష్మి’ పథకం కింద ఆర్థిక సాయం అందజేయనున్నది. ఇప్పటికే దరఖాస్తులు స్వీకరించడంతోపాటు పరిశీలన ప్రక్రియ సైతం పూర్తయ్యింది. రంగారెడ్డి జిల్లాలో తొలి విడుతలో ఎనిమిది నియోజకవర్గాల్లో మొత్తం 22,150 మందికి రూ.3లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం సంకల్పించింది.
‘గృహలక్ష్మి’ కోసం జిల్లావ్యాప్తంగా 44,985 మంది దరఖాస్తు చేసుకోగా, క్షేత్ర స్థాయిలో సర్వే జరిపిన అధికారులు 31,169 మందిని అర్హులుగా తేల్చారు. వీరి వివరాలను ఆన్లైన్లో నమోదు చేసే ప్రక్రియ వేగవంతంగా సాగుతుండగా.. త్వరలోనే లబ్ధిదారులకు ్రప్రొసీడింగ్ పత్రాలను అందజేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
-రంగారెడ్డి, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ)
డబుల్ బెడ్ రూం పథకంతో నిరుపేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం ‘గృహలక్ష్మి పథకం’లో జాగ ఉన్న పేదలకు సొంతింటి కలను సాకారం చేస్తున్నది. రంగారెడ్డి జిల్లాలో తొలి విడుతలో ఒక్కో నియోజకవర్గంలో 3వేల చొప్పున ఎనిమిది నియోజకవర్గాల్లో మొత్తం 22,150 మందికి రూ.3లక్షల చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని సంకల్పిస్తున్నది. ఇప్పటికే ఈ పథకానికి 44,985 మంది దరఖాస్తు చేయగా క్షేత్ర స్థా యిలో సర్వే జరిపిన అధికారులు 31,169 మం దిని అర్హులుగా తేల్చారు. త్వరలోనే వీరికి మం జూరు పత్రాలను అందజేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
శరవేగంగా లబ్ధిదారుల ఎంపిక..
ఇల్లు కట్టుకోవాలనే పేదల కలలు త్వరలోనే సాకారం కాబోతున్నాయి. సొంత జాగ ఉండి ఇల్లు నిర్మించుకునే స్థోమతలేని వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం గృహలక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్నది. రూ.3లక్షలను మూడు విడతల్లో లబ్ధిదారుల ఖాతాలో ప్రభుత్వం నేరుగా జమ చేయనున్నది. ఈ మేరకు తొలివిడుతలో సాయం అం దించేందుకు ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరించింది. ప్రజల నుంచి సైతం అనూహ్య స్పందన వచ్చి పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయి.
జిల్లా వ్యాప్తంగా మొత్తం 44,985 దరఖాస్తులు రాగా.. దరఖాస్తుల విచారణ ప్రక్రియను అధికార యంత్రాంగం వెను వెంటనే పూర్తి చేసింది. మండలాల పరిధిలో ఎంపీడీవో, ఎంపీవోలు రెండు బృందాలుగా ఏర్పడి పంచాయతీ కార్యదర్శులు, గ్రామ పంచాయతీ సిబ్బందితో విచారణ నిర్వహించారు. మున్సిపల్, కార్పొరేషన్ల పరిధిలో కమిషనర్ ఆధ్వర్యంలో అధికారుల బృం దం ప్రభుత్వం నిర్దేశించిన ఫార్మాట్లో దరఖాస్తుదారుల స్థితిగతులపై విచారణ జరిపింది. భారీ సంఖ్యలో వచ్చిన దరఖాస్తుల్లో జత చేసిన డాక్యుమెంట్లు సరైనవా? లేవా? అని ప్రత్యేక బృందా లు సర్వే నిర్వహించాయి.
ఈ మేరకు అర్హులను తేల్చి జాబితాను రూపొందించారు. జిల్లాలో ‘గృహలక్ష్మి’ పథకానికి 31,169 మందిని అర్హులుగా నిర్ణయించారు. ప్రొసీడింగ్స్ను ఆన్లైన్లో నమో దు చేసే ప్రక్రియ శరవేగంగా సాగుతున్నది. త్వరలోనే లబ్ధిదారులకు నేరుగా మంజూరు పత్రాలను అందించేందుకు సంబంధిత అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.