తెలంగాణ ప్రభుత్వం పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్నది. ఇప్పటికే ప్రతిష్టాత్మకంగా డబుల్ బెడ్రూం ఇండ్ల పథకాన్ని అమలు చేస్తుండగా, నూతనంగా గృహలక్ష్మి పథకానికి శ్రీకారం చుట్టింది. సొంత స్థలం ఉండి ఇల్లు నిర్మించుకునే వారికి రూ.3 లక్షల ఆర్థిక సాయాన్ని అందించనున్నది. ముందుగా ఈ పథకాన్ని నియోజకవర్గంలో 3 వేల మందికి వర్తింపజేయనున్నది. దీంతో వికారాబాద్ జిల్లాలోని వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ నియోజకవర్గాలకు చెందిన 12 వేల మందికి లబ్ధి చేకూరనున్నది. ఇప్పటికే జిల్లాకు 3,800 డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరయ్యాయి. ఇందులో తాండూరు నియోజకవర్గంలోని తాండూరు పట్టణంలో 401 ఇండ్లు, యాలాల మండలం కోకట్లో 180, ధారూరు మండల కేంద్రంలో 120 ఇండ్లు, మర్పల్లి మండల కేంద్రంలో 120, పరిగిలో 180, కొడంగల్లో 48, అడవి వెంకటాపూర్లో 30 డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాలు పూర్తికాగా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులు ఈనెలాఖరులోగా పూర్తయ్యేలా జిల్లాయంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేయనుండగా, కచ్చా గృహాల్లో ఉండేవారికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వనున్నది. అధిక మొత్తంలో దరఖాస్తులు వస్తే లాటరీ పద్ధతిలో లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు.
వికారాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ): గూడులేని ప్రతి నిరుపేదకూ సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే ఇప్పటికే డబుల్ బెడ్రూం ఇండ్ల పథకాన్ని అమలు చేస్తుండగా.. కొత్తగా గృహలక్ష్మి పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకంలో భాగంగా ఇల్లులేని వారికి ప్రభుత్వం ఆర్థి క సాయాన్ని అందజేయనున్నది. సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకునే స్థోమత లేని వారికి రూ.3 లక్షల చొప్పున ఆడబిడ్డల పేరిట ఆర్థిక సాయాన్ని అందించాలని బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే నియోజకవర్గానికి మూడు వేల మంది అర్హులకు ఈ పథకాన్ని వర్తింపజేయనున్నారు.
అయితే జిల్లాలోని వికారాబాద్, తాం డూరు, పరిగి, కొడంగల్ నియోజకవర్గాలకు సంబంధించి నియోజకవర్గానికి 3 వేల మంది చొప్పున మొత్తం 12 వేల మంది పేదలకు లబ్ధి చేకూరనున్నది. కాగా ఈ ఆర్థిక సాయాన్ని ప్రభు త్వం మూడు విడుతలుగా లబ్ధిదారులకు అందజేయనున్నది. ఇంటి పునాది దశలో రూ. లక్ష, స్లాబ్ దశలో మరో రూ.లక్ష, ఇంటి నిర్మాణం పూర్తయ్యే దశలో మరో రూ.లక్షను అందజేయనున్నది. అయితే ఈ పథకం అమలు బాధ్యతను ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు అప్పగించింది. లబ్ధిదారుల ఎంపిక వారి ఆధ్వర్యంలోనే జరుగనున్నది. ఇందుకు సంబంధించిన విధివిధానాలను ప్రభుత్వం వారం, పది రోజుల్లో జారీ చేయనున్నది. కాగా జిల్లాకు మంజూరైన డబుల్ బెడ్ రూం ఇండ్ల పనులనూ త్వరగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం చర్యలను ముమ్మరం చేసింది.
గూడు లేని నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూం ఇండ్ల పనుల పూర్తికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలోని యాలాల మండలంలోని కోకట్, కుల్కచర్ల మం డలంలోని అడవివెంకటాపూర్, ధారూరు మండల కేంద్రం, మర్పల్లి, మోమిన్పేటలలో జరుగుతున్న ఇండ్ల నిర్మాణ పనులు దాదాపుగా పూర్తి కావొచ్చాయి. ఈ నెలాఖరులోగా ఆ ఇండ్ల పను లను పూర్తి చేసి ప్రారంభించేందుకు సిద్ధం చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. తాండూరు నియోజకవర్గంలోని తాండూరు పట్టణంలో 401 ఇండ్లు, యాలాల మండలంలోని కోకట్లో 180 ఇండ్లు, ధారూరు మండల కేం ద్రంలోని 120 ఇండ్లు, మర్పల్లి మండల కేం ద్రంలోని 120 ఇండ్లు, పరిగిలో 180, కొడంగల్లో 48 ఇండ్లు, అడవివెంకటాపూర్లో 30 ఇండ్లకు సంబంధించి పనులు పూర్తికాగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులు ఈ నెలాఖరులోగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం ప్రభుత్వం ఇప్పటికే రూ.5 కోట్ల నిధులనూ విడుదల చేసింది.
మరోవైపు కుల్కచర్ల మండలంలో ని అడవివెంకటాపూర్లో నిర్మిస్తున్న 30 ఇండ్ల ల్లో మౌలిక వసతుల పనులు కూడా ఇప్పటికే పూర్తయ్యాయి. కాగా జిల్లాకు ప్రభుత్వం 3800 డబుల్ బెడ్రూం ఇండ్లను మంజూరు చేయగా.. అన్నింటికీ పరిపాలన అనుమతులొచ్చాయి. అందులో 2,257 ఇండ్ల నిర్మాణాలు ఆయా దశల్లో కొనసాగుతున్నాయి. అయితే తొలి విడుతలో ఒక్కో నియోజకవర్గానికి 400 చొప్పున డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేయగా..తర్వాత ఒక్కో నియోజకవర్గానికి అదనంగా డబుల్ ఇండ్లను మంజూరు చేసింది. తాండూరు సెగ్మెంట్కు 1500లకుపైగా డబుల్ ఇండ్లు మంజూరుకాగా ఇప్పటివరకు 1001 ఇండ్ల పనులు ఆయా దశల్లో ఉన్నాయి. వికారాబాద్ నియోజకవర్గంలో 526 ఇండ్లు, పరిగి నియోజకవర్గంలో 430 ఇండ్లు, కొడంగల్ నియోజకవర్గంలో 300 ఇండ్ల నిర్మాణ పనులు పలు దశల్లో సాగుతున్నాయి.
చేవెళ్ల నియోజకవర్గంలోని నవాబుపేట మండలానికి సంబంధించి డబుల్ బెడ్రూం ఇండ్ల పనులు ఇంకా షురూ కాలేదు. అదేవిధంగా ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి అయ్యే ఖర్చును గ్రామీణ ప్రాంతా ల్లో యూనిట్ ఖర్చు రూ.5.04 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.5.30 లక్షలుగా నిర్ణయించింది. అంతేకాకుండా యూనిట్ కాస్ట్తోపాటు మౌలిక వసతుల నిమిత్తం గ్రామీణప్రాంతాల్లో రూ. 1.25 లక్షలు, అర్బన్ ప్రాంతాల్లో రూ.75 వేల ను డ్రైనేజీ, నీటి వసతి తదితర మౌలిక వసతుల కు అందిస్తున్నది. మరోవైపు లబ్ధిదారుల ఎంపికను పారదర్శకంగా చేపట్టనున్నారు.
ప్రభుత్వం ప్రకటించిన గృహలక్ష్మి పథకంతో సొంతిల్లు నిర్మించుకోవాలన్న నా కల నెరవేరనున్నది. సొంతిల్లు లేక గుడిసెలో జీవిస్తూ ఎన్నో ఇబ్బందులు పడుతున్నా. ప్రభుత్వం సొంతింటి నిర్మాణానికి రూ.3 లక్షలు ఇస్తే మాకున్న ఖాళీ స్థలంలో ఇల్లు నిర్మించుకుంటా. గూడులేని నిరుపేదలకు ఈ పథకం ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.
-కావలి నర్సమ్మ, గృహిణి, చౌదర్పల్లి, బొంరాస్పేట మండలం
సొంత గూడు ఉండాలన్నది ప్రతి పేదవారి కల. ప్రస్తుతం పెరిగిన ధరలను బట్టి ఇల్లు నిర్మించుకోలేక.. కిరాయిలు కట్టలేక సతమతమవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సొంత స్థలం ఉన్న వారికి గృహలక్ష్మి పథకం కింద రూ.3 లక్షలను ఇస్తున్నట్లు ప్రకటించడం సం తోషంగా ఉన్నది. ఈ పథకం కింద మా స్థలంలో చిన్న గూడు కట్టుకుంటాం. మా లాంటి వారికి ఇది ఓ వరం. పేదల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తు న్న ప్రభుత్వం, సీఎం కేసీఆర్ సారుకు ఎల్లప్పుడూ అండగా ఉంటాం.
గొట్టిముక్కుల వెంకటయ్య, చౌదర్పల్లి, బొంరాస్పేట
నా భర్త మృతి చెందిండు. కూలీ పనులు చేసుకుంటూ కుమారుడితో కలిసి ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నా. నాకు ప్రభుత్వం నుంచి సొంతిల్లు మంజూరు కాలేదు. నాకు సొంత స్థలం ఉన్నది. సర్కార్ ఇచ్చే రూ.మూడు లక్షల సాయంతో ఇల్లు కట్టుకుంటా. నాలాంటి నిరుపేదలకు గృహలక్ష్మి పథకం వరం లాంటిది.
-కుమ్మరి రాములమ్మ, బురాన్పూర్, బొంరాస్పేట మండలం