తాండూరు రూరల్ : అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ను రెవెన్యూ అధికారులు గురువారం రాత్రి పట్టుకున్నారు. తాండూరు మండలం, గోనూర్ సమీపంలోని కాగ్నా వాగులో నుంచి మాచనూరు అనంతప్ప అనే వ్యక్తి ట్రాక్టర్లో అనుమతి లేకుండా ఇసుకను తరలిస్తుండగా పట్టుకున్నట్లు తాహసీల్దార్ చెన్నప్పలనాయుడు తెలిపారు. ఇసుక ట్రాక్టర్ను తాహసీల్దార్ కార్యాలయానికి తరలించామన్నారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ యజమానికి రూ. 5వేల జరిమానా విధించినట్లు తెలిపారు. ఎవరైనా అక్రమంగా ఇసుక తరలిస్తే చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.