తాండూరు : మార్వాడి యువమంచ్ తాండూరు శాఖ ఆధ్వర్యంలో తాండూరు పట్టణంలోని శ్రీబాలాజీ మందిరంలో ఉచిత జైపూర్ కాళ్ల అమరిక, కెలిపర్ శిబిరము కొనసాగుతుంది. ఈ నెల 8వ తేది వరకు నిర్వహించే ఉచిత జైపూర్ కాళ్ల అమరిక శిబిరానికి మొదటి, రెండో రోజు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి చికిత్సలకు వచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు. తాండూరు డీఎస్పీ లక్ష్మినారాయణ శిబిరాన్ని పరిశీలించి నిర్వాహకులను అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మానవసేవే మాధవసేవ అన్నారు.
సమసమాజ నిర్మాణానికి మార్వడీలు చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. కార్యక్రమంలో మార్వాడి యువమంచ్ ప్రతినిధులు ఉన్నారు.