తాండూరు : తాండూరు నియోజకవర్గంలో శనివారం క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. తాండూరు పట్టణం, తాండూరు, యాలాల, బషీరాబాద్, పెద్దేముల్ మండల కేంద్రాలతో పాటు పల్లెలోని చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. తాండూరు మెథడిస్ట్ చర్చి, శివాజీక్, ఇంద్రానగర్లోని హెబ్రోన్చర్చిల్లో, సెయింట్ మార్క్ చర్చి, సాయిపూరు కింగంసాలెం చర్చి, రాజీవ్ గృహకల్పలోని నజరేతు చర్చిలో ఉదయం 11నుంచి మధ్యాహ్నం 3గంటల వరుకు నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో క్రైస్తవులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఏసు ప్రభును స్మృతిస్తు భక్తులు ఆలాపించిన దైవ భక్తి గీతాలు, కీర్తనలు అలరించాయి. ఈ సందర్భంగా పాస్టర్లు ఏసుక్రీస్తు జన్మదిన విశిష్టతను వివరించారు. ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్నాయక్తో పాటు ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ సీనియర్ నేతలు చర్చిలకు వెళ్లి కేక్ కట్చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్రెడ్డి మాట్లాడుతూ మనిషి రూపంలో దేవుడు భూమిపై అవతరించిన రోజునే క్రైస్తవులు క్రిస్మస్ పండుగా జరుపుకుంటారని పేర్కొన్నారు. కులమతాలకు అతీతంగా హిందువులు, ముస్లీంలు, కలిసి భక్తి శ్రద్ధలతో పండుగలు జరుపుకోవడం అభినందనీయమన్నారు. నియోజకవర్గంలోని మండల కేంద్రాలు, గ్రామాల్లోని చర్చిల అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.