తాండూరు రూరల్ : ఢిల్లీ పీఠాన్ని కదిలించి సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని తాండూరు ఎమ్మెల్యే రోహిత్రెడ్డి అన్నారు. బుధవారం సీఎం కేసీఆర్ పుట్టిన రోజు పురస్కరించుకొని మూడు రోజుల కార్యక్రమంలో భాగంగా బుధవారం జిల్లా దవఖానాలో రక్తదానం చేశారు. అనంతరం రోగులకు అన్నదానం కూడా చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ డిప్యూటీ స్పీకర్, కేంద్ర మంత్రి పదవితో పాటు ఎంపీ పదవులకు గడ్డిపోచతో సమానంగా భావించి పదవులకు రాజీనామా చేసి, కోట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని గుర్తు చేశారు.
దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దారని తెలిపారు. వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు నియోజకర్గంలో విస్త్రంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న పరిమళ్గుప్తా, వైస్ చైర్మన్ దీప నర్సింలు, పట్టణ పార్టీ అధ్యక్షుడు నయీం, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వెంకట్రెడ్డి, పలువురు కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.