పరిగి, ఫిబ్రవరి 4: పదోతరగతిలో మండల స్థాయిలో టాపర్లుగా నిలిచిన ఇద్దరు విద్యార్థులకు నగదు బహుమతులు ఇస్తానని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్రెడ్డి తెలిపారు. శనివారం ఆయన మండలంలోని గడిసింగాపూర్, రూప్ఖాన్పేట, సుల్తాన్పూర్, మిట్టకోడూర్, నస్కల్ గ్రామాల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో పదోతరగతి చదువుతున్న విద్యార్థులకు బీఎంఆర్ ఫౌం డేషన్ ఆధ్వర్యంలో స్టడీ మెటీరియల్ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆయా గ్రామాల్లో జరిగిన సమావేశాల్లో మాట్లాడుతూ ప్రతి మండలం నుంచి పదో తరగతిలో టాపర్లుగా నిలిచిన ఇద్దరు విద్యార్థులకు బీఎంఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నగదు బహుమతులను అందజేస్తామని తెలిపారు. పరీక్ష సమయంలో విద్యార్థులు మానసికంగా ఇబ్బంది పడకుండా ఉండేందుకు ప్రత్యేకంగా అవగాహన సదస్సులను అన్ని మండలాల్లో ఏర్పాటు చేయడం జరుగుతుందని.. వాటిని టెన్త్ క్లాస్ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
విద్యాభివృద్ధితోనే ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందుతుందని.. అందువల్ల పరిగి నియోజకవర్గంలో విద్యాభివృద్ధే లక్ష్యంగా పని చేస్తున్నట్లు ఆయన చెప్పారు. విద్యార్థులు ఇష్టంతో చదివి రాష్ట్ర, జిల్లా స్థాయిలో టాపర్లుగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డీసీసీబీ చైర్మన్ మనోహర్రెడ్డిని పలువురు సన్మానించా రు. ఆయా కార్యక్రమాల్లో గండీడ్ పీఏసీఎస్ చైర్మన్ కమతం శ్రీనివాస్రెడ్డి, సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షుడు అశోక్వర్ధన్రెడ్డి, నార్మాక్స్ డైరెక్టర్ వెంకట్రాంరెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు ఎస్పీ బా బయ్య, భాస్కర్గుప్తా, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు రాజేందర్, సర్పంచ్లు నర్సింహ, పద్మ, విజయలక్ష్మి, పద్మ, పీఏసీఎస్ డైరెక్టర్లు రాంరెడ్డి, మాణిక్యం, నాయకులు మాణిక్యం, వెంకట్రాములు, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు , తదితరులు పాల్గొన్నారు.