చేవెళ్ల రూరల్, నవంబర్ 24 : బీఆర్ఎస్ సర్కార్ హయాంలోనే సకల జనుల సంక్షేమం సాధ్యమవుతున్నదని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. శుక్రవారం చేవెళ్లలోని కేజీఆర్ గార్డెన్లో నియోజకవర్గ మైనార్టీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరుకాగా, ఎమ్మెల్యే కాలె యాదయ్య, బీఆర్ఎస్ నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి కార్తీక్రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోం మంత్రి మాట్లాడుతూ.. ముస్లిం మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి ఉన్న ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమేనన్నారు. బీఆర్ఎస్ హయాంలోనే మైనార్టీలకు అభివృద్ధి ఫలాలు అందుతున్నాయన్నారు.
తెలంగాణ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా కుల, మత, వర్గ, వర్ణ బేధాలు కుండా అన్ని వర్గాల ప్రజలను సమ ప్రాధాన్యతతో చూస్తున్నదన్నారు. సీఎం కేసీఆర్ ముస్లిం మైనార్టీల అభివృద్ధికి పాటుపడిన సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి , అండగా నిలబడిన ఎమ్మెల్యే అభ్యర్థి కాలె యాదయ్యకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి మరింత అభివృద్ధికి బాటలు వేయాలన్నారు. ఎమ్మెల్యే కాలె యాదయ్య మాట్లాడుతూ మరోసారి బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. అంతకు ముందు బీఆర్ఎస్ ఎన్నికల ఇన్చార్జి కార్తీక్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల్లో ముస్లిం మైనార్టీల మద్దతు బీఆర్ఎస్ పార్టీకి ఉండాలని అన్నారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పెద్దొళ్ల ప్రభాకర్, వైస్ ఎంపీపీ శివ ప్రసాద్, వ్యవసాయ మారెట్ కమిటీ చైర్మన్ మిట్ట వెంకట రంగారెడ్డి, వైస్ చైర్మన్ నర్సింహులు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రమణారెడ్డి, కృష్ణారెడ్డి, మాజీ ఎంపీపీ బాల్ రాజ్, బీఆర్ఎస్ మండల బీసీసెల్ అధ్యక్షుడు రాములు, సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షుడు శేరి శివారెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, మారెట్ కమిటీ మాజీ చైర్మన్ శివనీలచింటు, బీఆర్ఎస్ నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు రవికాంత్ రెడ్డి, బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు రామాగౌడ్, బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి నరేందర్ గౌడ్, గుడిమలాపూర్ మారెట్ కమిటీ మాజీ డైరెక్టర్ యాదగిరి, మారెట్ కమిటీ డైరెక్టర్ ఫయాస్, బీఆర్ఎస్ మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు అబ్దుల్ ఘని, బీఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షుడు శేఖర్, బీఆర్ఎస్వీ నియోజకవర్గ అధ్యక్షుడు రాఘవేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు మద్దెల జంగయ్య, వంగ శ్రీధర్ రెడ్డి, శేరి రాజు, సాయినాథ్, ఎల్లన్న, నర్సింహులు, మైనార్టీ నాయకులు ఎంఏ బాసిత్, అలీ, చేవెళ్ల జామ మసీద్ కమిటీ ప్రెసిడెంట్ అబ్దుల్ ఖాదర్, మల్కాపూర్ ఉప సర్పంచ్ సయ్యద్ జాఫర్, మైనార్టీ నాయకులు ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు.