మహిళా సంఘాల ఆర్థిక స్వావలంబనకు రాష్ట్ర సర్కార్ చేయూతనందిస్తున్నది. ఏటా స్త్రీనిధి, బ్యాంకు లింకేజీ ద్వారా రుణాలను అందజేస్తూ మహిళల జీవనోపాధికి ప్రోత్సహిస్తున్నది. రుణాలు పొందిన మహిళలు గొర్రెలు, మేకలు కొనుగోలు చేసి ఉపాధి పొందుతుండగా, కొందరు కిరాణా దుకాణాలు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఆర్థికంగా బలపడుతున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో స్త్రీనిధి నుంచి 92.73 కోట్లు, బ్యాంకు లింకేజీతో రూ.463.19 కోట్ల రుణాలను అందించాలని వికారాబాద్ జిల్లాయంత్రాంగం లక్ష్యంగా పెట్టుకున్నది. ఇప్పటికే ఒక్కో సంఘానికి రూ.5 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు రుణాలను అందజేస్తున్నది. జిల్లాలో 657 గ్రామ సంఘాలు, 15847 మహిళా స్వయం సహాయక సంఘాలు ఉండగా, 1,66,044 మంది సభ్యులు ఉన్నారు. లక్ష్య సాధన కోసం మండలాల వారీగా అధికారులు కృషి చేస్తుండడం విశేషం.
బొంరాస్పేట, మే 28 : మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేయూతనందిస్తున్నది. బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి ద్వారా రుణాలను అందిం చి తోడ్పాటును అందిస్తున్నది. 2023-24 ఆర్థిక సంవత్సరంలోనూ ప్రభుత్వం మహిళా స్వయం సహాయక సంఘాలకు అందించే రుణాల లక్ష్యాన్ని వికారాబాద్ జిల్లాకు నిర్దేశించింది. స్త్రీనిధి పథకం ద్వారా ఈ ఏడాది జిల్లాలోని మహిళా సంఘాల సభ్యులకు రూ.92.73కోట్లు.. బ్యాంకు లింకేజీ ద్వా రా రూ.463.19 కోట్ల రుణాలను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నది. గత ఆర్థిక సంవత్సరంలో స్త్రీనిధి రుణాల పంపిణీ లక్ష్యంలో 75శాతం రుణా లు అందజేయగా, బ్యాంకు లింకేజీలో 95శాతం లక్ష్యాన్ని అధికారులు చేరుకున్నారు. ఈ ఆర్థిక సం వత్సరంలోనూ నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించేందు కు ఐకేపీ సిబ్బంది కృషి చేస్తున్నారు. మహిళా సం ఘాల సభ్యులు ఆర్థికంగా వృద్ధిలోకి వచ్చేందుకు ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా రుణాలను అం దించి ప్రోత్సహిస్తున్నది. బ్యాంకులు, స్త్రీనిధి సంస్థల ద్వారా పావలా వడ్డీకే రుణాలను అందిస్తుండడంతో మహిళలు వాటిని సద్వినియోగం చేసుకుంటున్నారు. రుణాలు పొందిన మహిళలు గొర్రెలు, మేకలు, కిరాణా షాపులు తదితర వాటిని ఏర్పాటు చేసుకుని ఆర్థికంగా బలపడుతున్నారు. తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లిస్తుండటంతో బ్యాంకులు మళ్లీ మహిళలకు రుణాలు ఇస్తున్నాయి.
స్త్రీనిధి రుణాలు.. రూ. 92.73 కోట్లు
జిల్లాలోని మహిళా సంఘాల సభ్యులకు ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.92.73 కోట్ల స్త్రీనిధి రుణాలను ఇవ్వాలని ప్రభుత్వం నిర్దేశించింది. ఇందులో సెర్ప్ ఏరియాలో రూ.79.73 కోట్లు, మెప్మా ఏరియాలో రూ.13 కోట్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వీటిలో సువిధ రుణాలు 30 శాతం, జీవనోపాధుల కోసం ఇచ్చే రుణాలు 70 శాతం ఉన్నాయి. స్త్రీనిధి రుణాల్లో జిల్లాకు డెయిరీ యూనిట్లు 300, గొర్రె పొట్టేళ్ల పెంపకం యూనిట్లు 20, కోడి పిల్లల పెంప కం యూనిట్లు 400, ఎంవైపీ యూనిట్లు 2, ఎలక్ట్రి క్ ఆటోలు20, కూరగాయల పందిరి సాగు యూని ట్లు 12, వ్యవసాయ యంత్రాలను అద్దెకిచ్చే యూ నిట్1, ఎలక్ట్రిక్ బైక్లు 30, జనరిక్ మందుల షాపు లు 2, ఇండ్ల మరమ్మతులకు 20 యూనిట్లు, సోలార్ విద్యుత్ యూనిట్లు 350 కేటాయించారు.
బ్యాంకు లింకేజీ .. రూ.463.19 కోట్లు
జిల్లాలో 657 గ్రామ సంఘాలు, 15,847 మహిళా స్వయం సహాయక సంఘాలుండగా అందులో 1,66,044 మంది మహిళలు సభ్యులుగా ఉన్నా రు. తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లిస్తున్న సంఘాలకు ప్రభుత్వం బ్యాంకు లింకేజీ ప్రతి ఏటా పావలా వడ్డీకే రుణాలను అందజేస్తున్నది. ఒక్కో సంఘానికీ రూ.5 నుంచి రూ.15 లక్షల వరకు రుణాలను ఇస్తున్నారు. ఈ ఏడాది జిల్లాలోని 10, 375 మహిళా సంఘాలకు రూ.463.19 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలను ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది. గత ఆర్థిక సంవత్సరంలో 13,218 సంఘాలకు రూ.537.45 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలు అందించాలని లక్ష్యంగా పెట్టుకోగా 8,837 సంఘాలకు రూ.499.83 కోట్లు రుణాలను అందించి 93 శాతం లక్ష్యాన్ని సాధించారు.
మండలాల వారీగా ..
జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరంలో 19 మండలాల్లో ని మహిళా సంఘాలకు అందించే రుణాల లక్ష్యం ఇలా ఉన్నది. బంటారం మండలంలో 285 సం ఘాలకు రూ.11.89 కోట్లు, బషీరాబాద్లో 662 సంఘాలకు రూ.29.09 కోట్లు, బొంరాస్పేటలో 579 సంఘాలకు రూ.25.09 కోట్లు, చౌడాపూర్ లో 149 సంఘాలకు రూ.149 కోట్లు, ధారూరులో 452 సంఘాలకు రూ.19.43 కోట్లు, దోమలో 660 సంఘాలకు రూ.28.20 కోట్లు, దౌల్తాబాద్ లో 667 సంఘాలకు రూ.31.45 కోట్లు, కొడంగల్లో 454 సంఘాలకు 19.27 కోట్లు, కోటపల్లిలో 362 సంఘాలకు రూ.15.47 కోట్లు, కులకచర్లలో 810 సంఘాలకు రూ.34.37కోట్లు, మర్పల్లిలో 556 సంఘాలకు రూ.25.11 కోట్లు, మోమిన్పేట లో 653 సంఘాలకు రూ.31.47 కోట్లు, నవాబుపేటలో 529 సంఘాలకు రూ.24.80కోట్లు, పరిగి లో 589 సంఘాలకు రూ.24.93కోట్లు, పెద్దేముల్ లో 682 సంఘాలకు రూ.31.61కోట్లు, పూడూరు లో 608సంఘాలకు రూ.27.85కోట్లు,తాండూరు లో 623 సంఘాలకు రూ.26.34కోట్లు, వికారాబాద్లో 498 సంఘాలకు రూ.24.73 కోట్లు, యా లాల మండలంలో 557 సంఘాలకు రూ.24.11 కోట్లు బ్యాంకు లింకేజీ రుణాలను అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది.
లక్ష్యాన్ని చేరుకుంటాం
సీసీలు, ఇతర సిబ్బంది ని పూర్తిస్థాయిలో భాగస్వాములను చేసి ఈ ఆర్థిక సంవత్సరంలో స్త్రీ నిధి, బ్యాంకు లిం కేజీ ద్వారా ఇచ్చే రుణాల లక్ష్యాన్ని చేరుకుంటాం. బ్యాంకు లింకేజీ రుణ లక్ష్యా న్ని ఏటా చేరుకుంటున్నాం. కానీ స్త్రీనిధిలో క్షేత్ర స్థాయిలో ఉన్న సమన్వయ లోపం కారణంగా పూర్తి లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నాం. గత ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు లింకేజీ ద్వారా ఇచ్చిన రుణాల రికవరీ లో ఎన్పీఏ ను 7 నుంచి 2.7 వరకు తగ్గించాం. ఈ ఏడాది స్త్రీనిధిలోనూ ఎన్పీఏను తగ్గిం చేం దుకు కృషి చేస్తున్నాం.
-కృష్ణన్, డీఆర్డీవో వికారాబాద్ జిల్లా